జైశ్రీరామ్.
29. భారంబు నీది శుభ తీరంబుఁ జేర్చగను లేరన్యులీ వసుమతిన్.
గోరంగనేల నినుఁ జేరంగనున్నపుడు తీరంబుఁ జేర్చు జననీ.
శ్రీరమ్య తేజసవు శ్రీరామ రక్షవయి వారింపుమా దురితముల్.
కోరన్ నినున్ ధనము కారుణ్యమున్ గనెడి ధీరాత్మవీవెగ సతీ!
భావము.
ఓ సతీ మాతా!శుభముల తీరమునకు చేర్చెడి భారము నీదేనమ్మా. ఈ భూమిపై
నీకన్న అన్యులు లేరు.ఒడ్డునకు నన్ను చేర్చెడి ఓ తల్లీ! నెన్ను చేరవలెనని
మనసున్నప్పుడు ఇన్ను కోరవలసిన పని యేమున్నదమ్మా. నీవే చేర్చుదువు.
మంగలప్రదమయిన తేజస్సు ఉన్న తల్లివి నాకు శ్రీరామ రక్షవయి నా
దురితములను నివారింపుమమ్మా. నిన్ను ధనములు కోరనమ్మా. కరుణతో
చూచెడి ధీరాత్మవు నీవేకదా.
జైహింద్.
Print this post
వ్రాసినది



0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.