గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, అక్టోబర్ 2016, సోమవారం

త్రిష్టుప్ ఛందము సోదాహరణ వివరణము. రచన శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
జైహింద్.

30, అక్టోబర్ 2016, ఆదివారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన Lesson 17 & 18

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

29, అక్టోబర్ 2016, శనివారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన Lesson 15

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

28, అక్టోబర్ 2016, శుక్రవారం

శ్రీ శివతాండవ స్తోత్రము . . . భావము.

2 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

27, అక్టోబర్ 2016, గురువారం

9 సంఖ్య ప్రాముఖ్యం . . . శ్రీరామకవచం సుబ్రహ్మణ్యం

1 comments

జైశ్రీరామ్.
సంఖ్య 9 ప్రాముఖ్యం ::
8 +1 = 9
7 + 2 = 9
6 + 3 = 9
5 + 4 = 9
9 + 8 + 7 + 6 + 5 + 4 + 3 + 2 + 1 = 45. 4 + 5 = 9
మహాభారతంలో 18 సంఖ్యకు చాలా ప్రాముఖ్యం ఉన్నది. వ్యాస భగవానునికి 18వ సంఖ్య ప్రీతికరమైనది. భారతంలో కాకుండా రామాయణంలో కూడా 18 కాండములు ఉన్నాయి.
9వ సంఖ్య ప్రాముఖ్యం
9 సంఖ్యకు జోతిషశాస్త్రంలో ప్రాముఖ్యం కనిపిస్తున్నది. నక్షత్రములు 27 అనగా 2 + 9 = 9.
ప్రతి నక్షత్రానికి అధిదేవతలు ఆయా నక్షత్రాలు అనుసరించి చెప్పబడ్డాయి.
27 నక్షత్రములకు - 27 అధిదేవతలు.
27 నక్షత్రములు - 27 ఆకృతులు - 27 వర్ణాలు.
ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలుగా విభజించడం వలన 27 నక్షత్రాలకు 108 పాదాలు. ఒక్కొక్క పాద ప్రమాణం 3 డిగ్రీల 20 నిమిషాలు. 27 నక్షత్రాలు - 108 పాదాలు. 12 రాశులు. ఒక్కోరాశి ప్రమాణం 30 డిగ్రీలు. 12 రాశుల మొత్తం ప్రమాణం 360 దిగ్రీలుగా చెప్పాలి. 3 + 6 = 9గా వస్తుంది.
1 + 8 = 9
10 + 8 = 18 = 9
1 + 8 = 9
2 + 7 = 9
ఒక్కొక్కరాశికి 9 పాదాలు - 12 రాశులకు 12 క్ష్ 9 = 108. 108 = 1 + 8 = 9.
కాన్పుకు నవ మాసాలు నిండాలి.
నవ బ్రాహ్మలు, నవగోప్యములు, నవకావ్యగుణములు, నవ ఆత్మ గుణములు. నవవిధభక్తి, నవ ఖండములు, నవ ఆత్మలు, నవ కర్మసాక్షులు, నవచక్రములు, నవతారా శుభాశుబ ఫలములు, నవ ద్వీపములు, నవధాతువులు, నవధాన్యములు, నవనాడులు, నవవిదులు, నవ ప్రజాపతులు, నవభాక్తులు, నవగ్రహ దేవతలు, నవ మహారత్నములు, నవరత్నములు, నవరసములు, నవవిధ అవస్థలు, నవవిధ దుఃఖములు, నవవిధధర్మములు, నివవిష(ము) స్థానములు, నవ శరీర రంథ్రములు, నవసంచార నిషిద్ధ స్థలములు, నవసంబంధములు, మొ.నవి.
మహాభారతములో 18 స్కంధములు : 1 + 8 = 9
వ్యాసపురాణములు : 18 = 1 + 8 = 9
ఉపపురాణములు: 18 = 1 + 8 = 9
స్మృతులు: 18 = 1 + 8 = 9
భగవద్గీతలోని అధ్యాయములు: 18 = 1 + 8 = 9
మహాభారతములోని పర్వములు: 18 = 1 + 8 = 9
యద్ధం జరిగిన రోజులు: 18 = 1 + 8 = 9
పోరాడిన అక్షౌహిణుల సంఖ్య: 18 = 1 + 8 = 9
ప్రతి అక్షౌహిణులో కాల్బలము సంఖ్య: 109350 - 1 + 0 + 9 + 3 + 5 + 0 = 18 = 1 + 8 = 9
గుఱ్ఱములు: 65610 - 6 + 5 + 6 + 1 + 0 = 1 + 9 = 9
రథములు 21870 - 2 + 1 + 8 + 7 + 0 = 1 + 8 = 9
ఏనుగులు: 2187 - 2 + 1 + 8 + 7 = 1 + 8 = 9
అంతా 18 మయమే
కృతయుగం = 17,28,000 వేలు - 1 + 7 + 2 + 8 = 18 = 1 + 8 = 9
త్రేతాయుగం = 12,96,000 - 1 + 2 + 9 + 6 = 18 = 1 + 8 = 9
ద్వాపరయుగం = 8,64,000 - 8 + 6 + 4 = 18 = 1 + 8 = 9
కలియుగం = 4,32,000 సంవత్సరములు - 4 + 3 + 2 = 9
కలియుగం కన్నా ద్వాపరయుగం రెండురెట్లు, త్రేతాయుగం మూడు రెట్లు, కృతయుగం నాలుగు రెట్లు. నాలుగు యుగముల మొత్తం:
17,28,000 + 12,96,000 + 8,64,000 + 4,32,000 = మొత్తం 43,200,000 = 4 + 3 + 2 = 9
అయ్యప్ప గుడి మెట్లు 18.
శక్తి క్షేత్రాలు 18
మహాభారతా యుద్ధాన్ని పరిశీలిస్తే పోరాడిన 18 అక్షౌహిణుల సేన 50 లక్షల సైనికు, 12 లక్షల అశ్వాలు, 4 లక్షల ఏనుగులు. కాని కౌరవ సేన 11 అక్షౌహిణులుగా, పాండవసేన 7 అక్షౌహిణులు. యుద్ధము జరిగిన రోజులు 18. భీష్ముడు - 10 రోజులు, ద్రోణుడు 10 నుండి 15వ రోజు వరకు (5), కర్ణుడు - 17 నుండి 17వ రోజు వరకు (2), శల్యుడు - 17 నుంది 1/2 రోజు (1/2), సుయోధనుడు - 1/2 రోజు. మొత్తము 18 రోజులలో యుద్ధము ముగిసినది.
(సంక్షిప్తంగా శ్రీరామకవచం సుబ్రహ్మణ్యం గారి రచన "సంఖ్యలు అవతరణ - ప్రాముఖ్యం", ఋషిపీఠం విశిష్ట సంచిక 2014 నుండి)
జైహింద్.

26, అక్టోబర్ 2016, బుధవారం

తోలుబొమ్మలాట.

0 comments

జైశ్రీరామ్.
జైహింద్. 

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన

1 comments




25, అక్టోబర్ 2016, మంగళవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన .Learn Sanskrit Part 1_1

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

24, అక్టోబర్ 2016, సోమవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన Consonants (2/2)

1 comments

జైశ్రీరామ్

జైహింద్.

23, అక్టోబర్ 2016, ఆదివారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన - Part 1 - Single letters

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

22, అక్టోబర్ 2016, శనివారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన Lesson 23 & 24

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

21, అక్టోబర్ 2016, శుక్రవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన Lesson 21 & 22

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన Lesson 21 & 22

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

20, అక్టోబర్ 2016, గురువారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన Lesson 19 & 20

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

19, అక్టోబర్ 2016, బుధవారం

దృశ్య శ్రవన విధానము ద్వారా సంస్కృత భాషా బోధన Lesson 16

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

18, అక్టోబర్ 2016, మంగళవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన Lesson 14

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

17, అక్టోబర్ 2016, సోమవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 15}

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

16, అక్టోబర్ 2016, ఆదివారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 13}

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

15, అక్టోబర్ 2016, శనివారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 12}

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

14, అక్టోబర్ 2016, శుక్రవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 11}

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

13, అక్టోబర్ 2016, గురువారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 10}

1 comments

జైశ్రీరామ్

జైహింద్.

12, అక్టోబర్ 2016, బుధవారం

హిందూమత వివరణము . . . ప్రవీణ్.

1 comments

జైశ్రీరామ్.
హిందూమత వివరణము . . . ప్రవీణ్..
మీ మతమేది..? అని ప్రశ్నిస్తే "హిందూ మతం " అని సమాధానం చెప్తాము. అలా చెప్పటం తప్పుకాదు కానీ దాన్ని గూర్చి తెలిసికొనవలసినది చాలా ఉంది. నిజానికి "హిదూ " అనేది మతం కాదు. మతంగా పుట్టలేదు.క్రమపరిణామంలో మతంగా స్వీకరింపబడింది.
మనది "హిందూ ధర్మం ". ధర్మానికి,మతానికి చాలా తేడా ఉంది.ధర్మం అంటే "ధరతి విశ్వమితి ధర్మ:" అని ప్రపంచాన్ని ధరించేది ధర్మం." ధారణాద్ధర్మమిత్యాహు:"అని చెప్పబడినది. అంటే ఆధారమైనది. 'దేనికి..?' అంటే సమస్తమునకూ ఆధారమైనది ధర్మం. ఈ ధర్మం ఉంటేనే సమస్త ప్రపంచమూ నిలబడిఉంటుంది. ధర్మం నశిస్తే ఆధారంలేనిది పడిపోవడం సహజం కాబట్టి ప్రపంచమంతా పతనమవుతుంది.
ధర్మం అంటే:
"దృఞ్ ధారణే " అను ధాతువునుండి ధర్మశబ్దం పుట్టింది."ధారణాద్ధర్మమిత్యాహు: - ధర్మో ధారయతే ప్రజా: '; యత్స్యాద్ధారణ సంయుక్త: - సధర్మమితి నిశ్చయ: " అని ధరించేది ధర్మం. ప్రజలను ధరించునది కాబట్టి ధర్మమని చెప్పబడింది. ఈ ధర్మానికి పది లక్షణాలు ఉన్నవి "ధృతి: క్షమా దమో స్తేయం - శౌచ మింద్రియనిగ్రహ: - ధీ ర్విద్యా సత్యమక్రోధ: - దశకం ధర్మలక్షణం." అని వేదాలను ప్రమాణంగా అంగీకరించడం,సంప్రదాయబద్దంగా వచ్చే విభిన్న సాధనా మార్గాలను అనుసరించడం,ఉపాసనీయ దేవీ దేవతలయందు భక్తి కలిగియుండడం హిందూధర్మ లక్షణాలుగా లోకమాన్య తిలక్ కూడా చెప్పారు. ఇలాంటి నిర్వచనాలన్నీ కలసికూడా హిందూధర్మానికి సమగ్ర నిర్వచనం కావు. అంతటి మహోన్నతమైనది హిందూధర్మం.
ఆధారమైన ధర్మం నశిస్తే జరిగేది పతనం. ధర్మం అన్నిచోట్లా ఉండవలసినది.మనుష్యునిలో మనుష్యధర్మం ఉంటే వాడు మనుష్యుడనిపించుకుంటాడు.వాడు ధర్మం తప్పితే పతనమైపోతాడు.అలా స్త్రీ, పురుష, పితృ,మాతృ,సోదర... ధర్మాలు చాలా ఉంటాయి.వారిలో ఆ దర్మాలు ఉన్నంతవరకే అలా గౌరవించబడతారు.ఆ ధర్మాలు నశిస్తే వారు పతనమైనట్లే.అలా ప్రపంచమంతటికీ భగవద్దత్తమైన ఒకే ఒక్క ధర్మం హిందూ ధర్మం. ఆద్యంతాలు లేనిది కాబట్టే దీనిని "సనాతనధర్మం " అంటాము.(సనా - సదా భవతీతి సనాతన:) ఋషిసత్తములు అందించిన ధర్మం కాబట్టి దీనిని "ఆర్షధర్మం" అన్నారు.భారతదేశంలో ఉన్నందున దీనిని "భారతీయధర్మం"అనేవారకూడా ఉన్నారు. ఎన్నిపేర్లు ఉన్నా దీని ప్రధాననామం "హిందూధర్మం".
సృష్టిలో చరాచరమగు ప్రతి అంశానికీ ఒక ధర్మం ఉంటుంది.ఆ ధర్మం ఉంటేనే అది అదిగా చెప్పబడుతుంది."ఏ నేదం ధార్యతే స ధర్మ:" ఒకటి దేనివలన ధరింపబడుతుందో అది దాని ధర్మం. ప్రపంచమంతా ధర్మమునందే నిలిచిఉన్నది కాబట్టే "ధర్మే సర్వం ప్రతిష్ఠితం" అని చెప్పబడింది."ధర్మో విశ్వస్య జగత: ప్రతిష్ఠా "అని సమస్త ప్రపంచాన్ని నిల్పగలిగినది ఈ ధర్మమే.ఈ ధర్మం పుట్టింది మన హిందూస్థాన్ లోనే...
వేదం "ధర్మం చర" అని ధర్మాన్ని ఆచరింపమని లోకాన్ని శాసిస్తోంది.అది కాదనరాని దైవశాసనం. "ధర్మాన్న ప్రమదితవ్యం " ధర్మంలో ఏమరపాటు తగదని."ధర్మమేవ హతోహంతి - ధర్మోరక్షతి రక్షిత:" ధర్మాన్ని నాశనంచేస్తే అది మనకే ప్రమాదమని తెలుపుతుంది.
"యతోభ్యుదయ నిశ్శ్రేయసస్సిద్ది: స ధర్మ:" అంటే ఇహపర సద్గతులనొసగేది ధర్మమని ధర్మప్రయోజనాన్ని కణాదుని వైశేషిక సిద్ధాంతం చెబుతోంది.అభ్యుదయం అనేది జీవితానంతరం స్వర్గంలోను, ఇతర జన్మ పరంపరలోను రాబోవు సుఖాన్ని తెలియజేస్తుంది. నిశ్రేయసం మోక్షానందాన్ని తెలియజేస్తుంది.
ఈ ధర్మాలు సాధారణ ధర్మాలు,విశేషధర్మాలు అని రెండువిధాలు.యజ్ఞ,దాన,తపస్సుల వంటివి సాధారణ ధర్మాలు.ఆపద్ధర్మాలు, ధర్మసూక్షమాలు వంటివి విశేష ధర్మాలు.
"అధ్యయనాత్ న చ పండిత: - ధర్మం చరతి పండిత:"దర్మాధ్యయనం వలన పండితుడు కాడు, ధర్మాచరణ చేయువాడే పండితుడు.
ఒకే విషయంలో భిన్నధర్మాలు కనబడితే పెద్దల ఆచరణలో ఏది నిలిచిందో అదే ధర్మ.ఫలితాంశంగా మానవులు దేనినాచరించటం వలన శ్రేయస్సు పొందుదురో, పాపం పొందకుందురో అది ధర్మం.
ధర్మార్థకామమోక్షా లనే చతుర్విధ పురుషార్థాలలో శ్రేష్ఠం ధర్మం. మిగిలిన మూడింటిని సాధించడానికి ఇదే మార్గం.
ధర్మం అనగా " విద్వద్భిస్సేవితం సద్భి: నిత్యమత్వేషరాగిభి: ; హృదయేనాభ్యనుజ్ఞాతో - యో ధర్మస్తం నిబోధత " అనగా రాగద్వేషాలకు అతీతులగు మహాజ్ఞానులచే ధర్మాన్ని అనుసరింపమని మనల్ని ఆదేశించారు.
"అనిత్యాని శరీరాణి-విభవో నైవ శాశ్వత: ; నిత్యం సన్నిహితో మృత్యు:-కర్తవ్యో ధర్మ సంగ్రహ:" అన్నారు పెద్దలు. శరీరం అశాశ్వతమైనది.సంపదలూ అశాశ్వతమైనవే.మృత్యుదేవత ఎల్లప్పుడూ ప్రక్కనే ఉంటుంది.కాబట్టి ధర్మరక్షణే మన కర్తవ్యం అని పై వాక్యానికి అర్థం.
అనేకంలో ఏకత్వాన్ని చూడగల సామర్థ్యం హిందూధర్మానికే ఉంది. ఈ ఏకత్వం కనబడక అనేకత్వం కనబడితే ఆ లోపం మనదే.ధర్మమే హిందువుయొక్క ఆత్మ.దీనిని బాగా అర్థంచేసుకోవాలి.భారతదేశ ఆత్మ ధర్మం కాబట్టే ధార్మికులైన హిందువులు తినడం, త్రాగటం, శయనించడం కూడా ధర్మబద్ధంగానే చేస్తారు.పుట్టినప్పటినుంచి మరణించేదాకా, సరిగా చెప్పాలంటే పుట్టుక ముందునుండీ చనిపోయాక కూడా ధర్మబద్దులయే ఉంటారు.ఈ విషయాలన్నీ అనంతబాగాల్లో చూస్తాము. పుట్టకముందు పుంసవన, సీమంతాది ధర్మకర్మలుంటాయి. చనిపోయాక అంత్యక్రియ,శ్రార్ధకర్మలు ఉంటాయి.అంటే హిందువుది పూర్తిగా ధర్మమయ జీవితం.ఆ ధర్మము తప్పితే హిందువు బ్రతికినా నిర్జీవుని లెక్క. కాబట్టి ప్రతి హిందువూ ధర్మమెరిగి ఆచరించాలి.
ఐహిక,పారమార్థిక ప్రయోజనాలు సాధించే ఈ ధర్మానికి నాలుగు లక్షణాలుంటాయి.1) వేద ప్రతిపాదితమై ఉండాలి.2)సంస్కృతిలో విశదీకరించబడి ఉండాలి.3)పెద్దల ఆచరణలో ఉండాలి.4)మనకు ప్రియమైనదికావాలి. వాటితోబాటు హిందూ ధర్మంలో ప్రధానాంశాలుగా దైవ విశ్వాసం, సదాచారం, శారీరక కర్మాధారమైన వర్ణధర్మం, మానసిక పరిణితి ఆధారంగా ఆశ్రమధర్మం, పాతివ్రత్యం, విగ్రహారాధన, యోగవిధి ; బ్రహ్మ - దేవ - పితృ - భూత - మానుష పంచయజ్ఞాలు; అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ - ఆనందమయ పంచకోశ పవిత్రత ; శ్రుతి,స్మృతి, పురాణ, మంత్ర, తంత్రాది విశ్వాసం; కర్మసిద్ధాంత,పునర్జన్మసిద్ధాంత విశ్వాసాలు; నిర్గుణ, సగుణోపాసన; ముక్తి విశ్వాసాలు ఇమిడి ఉన్నాయి. ఈ ధర్మం విశ్వధర్మం.దీనిని రక్షించడమంటే విశ్వాన్నే రక్షించడమని అర్థం. అలాంటి ధర్మరక్షణకు బద్ధులం కావాలి.
ధర్మరక్షణ:
ధర్మాచరణే ధర్మరక్షణలో ప్రధానాంశం. అది ఏ వయస్సు మళ్ళినవారో మరేమి చేయలేరు కాబట్టి చేయవలసింది కాదు. "యువైవ ధర్మశీలస్స్యాత్ - అనిత్యం ఖలు జీవితం; కోహిజానాతి కస్యాద్య - మృత్యుకాలో భవిష్యతి" అన్నారు విజ్ఞులు. యువకులుగా ఉన్ననాడే ధర్మాచరణకు పూనుకోవాలి.ఎందుకంటే ఈ జీవితం అశాశ్వతమైనది. మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు.కావున వెంటనే ధర్మకార్యానికి పూనుకోవాలి. " ఏక ఏవ సుహృద్ధర్మో నిధనేప్యనుయాతి య:" చచ్చాక కూడా తోడుండే ఒకేఒక మిత్రుడు మనమాచరించిన ధర్మమే.ఒకప్పుడు ఈ ధర్మమే మనలను పాలించేది.ఆనాటి రీతి " న రాజ్యం న చ రాజాసీత్ - న దండ్యో న చ దాండిక: ; ధర్మేణైవ ప్రజాస్సర్వా: - రక్షంతిస్మ పరస్పరం" అని చెప్పబడినది. నాడు రాజ్యం లేదు, రాజులేడు, దండన లేదు, దండింపబడేవాడు లేడు. ప్రజలంతా ధర్మాన్ని ఆధారంచేసుకొని పరస్పర రక్షణలో ఉన్నారని దాని భావం. అలా అత్యున్నత స్థితి ఈ ధర్మంలో చవిచూచాము. మరల అట్టి ధార్మిక సమాజాన్ని ఆశిద్దాం. అందుకై కృషి మననుండే జరగాలి.
స్వస్తి.
జైహింద్.

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 9}

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

11, అక్టోబర్ 2016, మంగళవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 8}

0 comments

జైశ్రీరామ్

జైహింద్.

10, అక్టోబర్ 2016, సోమవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 7}

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

9, అక్టోబర్ 2016, ఆదివారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 6}

2 comments

జైశ్రీరామ్

జైహింద్.

8, అక్టోబర్ 2016, శనివారం

సరస్వతీ బీజాక్షర సాధనము.

1 comments

జైశ్రీరామ్.

అమ్మా! శారద! పోతనార్య కవి మాహాత్మ్యంబు నీవే కదా!.
కొమ్మా యంచు త్వదీయ శక్తి నిడి నీ కూర్మిన్ కవిత్వామృతం
బిమ్మా లోక హితంబు గూర్చు కృతు లే నిద్ధాత్రి నిర్మింపఁగా!
రమ్మా! రక్షణ నీవె లోకమునకున్ రమ్యాకృతీ! భారతీ!
జైహింద్.

7, అక్టోబర్ 2016, శుక్రవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 5}

0 comments

జైశ్రీరామ్

జైహింద్.

6, అక్టోబర్ 2016, గురువారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 4}

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

5, అక్టోబర్ 2016, బుధవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 3}

3 comments

జైశ్రీరామ్

జైహింద్.

4, అక్టోబర్ 2016, మంగళవారం

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన {Video 2}

1 comments

జైశ్రీరామ్

జైహింద్.

3, అక్టోబర్ 2016, సోమవారం

శ్రీ పుల్లెలశ్యామ్ గారి మణిప్రవాళములో అందగించిన కందము

5 comments

జైశ్రీరామ్ . 
శ్రీ పుల్లెలశ్యామ్  గారి మణిప్రవాళములో అందగించిన కందము దాని బంధమరందమాధురి గ్రోలండి.
కం. 
ఐ నో సమాఫ్ద పీపుల్ 
మే నాటెంజోయ్ ద తెలుగు మీటరినింగ్లీష్ 
వై నాటీజ్ మై క్వొశ్చెన్ 
హౌ నై సీజ్ దట్ రిథం యిననదర్ లాంగ్వేజ్.
జైహింద్.

దృశ్య శ్రవణ విధానము ద్వారా సంస్కృత భాషా బోధన{Video 1}

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

2, అక్టోబర్ 2016, ఆదివారం

సంస్కృత వర్ణములు.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.

1, అక్టోబర్ 2016, శనివారం

శ్రీ విష్ణు సహస్రనామమ్ . . . శ్రీ యస్పీ బాలసుబ్రహ్మణ్యమ్.

1 comments

జైశ్రీరామ్.

జైహింద్.