క :-ఆంతా బాగున్నారా?
సంతోషము నొన్దినార? సజ్జనులగు మీ
యంతట మీరే పద్యము
కొంతైనా వ్రాసినారొ గురుతుగ నుండున్.
ఆంధ్రులారా! ఛందస్సు లోనే మనమెందుకు వ్రాయాలనుకొంటున్నారా?చెపుతాను, వినండి.
ఛందస్సు ఒక ఫ్రేమ్ లాంటిది. మన భావాన్ని ఛందో బద్ధమైన అక్షర రూపంలో బిగించి మారడానికి వీలు లేకుండా చేస్తుంది. గణములు, యతులు, ప్రాసలు ఇందుకు తోడ్పడతాయి.
ఇక మీకు కందంలో పద్యం వ్రాయాలనుకున్నారనుకోండి. సులభ శైలిలో కందపద్యాలు వ్రాయబడిన కృష్ణ శతకం లాంటివి మనం మననం చేస్తే , ఒక పాతికపద్యాలు కంఠస్తం వచ్చేసరికి 26 వ పద్యం మీకు తన్నుకొస్తుంది. వ్రాయాలనిపిస్తుంది .
ఇంక గణాలంటారా అవి కాలానుగుణంగా నేర్చుకోవచ్చు. మేరూ ప్రయత్నించి మీ అనుభవాన్ని నాకూ పంచండి.
పితృదేవోభవ.
-
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
పితృదేవులు.
1. శా. శ్రీమన్మంగళసృష్టిలో జననియున్, చిన్మూర్తియౌ తండ్రియున్
క్షేమంబున్ గలిగించు దేవతలు, రాశీభూత ప్రేమాంశ...
1 వారం క్రితం

వ్రాసినది


