జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః🙏🏻
శ్లో. పరోపదేశ వేలాయాం - సర్వే వ్యాసపరాశరాః,
ధర్మే స్వయమనుష్టానం - కస్యచిత్తు మహాత్మనః.
ఆ.వె. ధర్మ బోధ చేయ ధరణి పైనందరు
నల పరాశరులును వ్యాసులె కద,
ఆచరించువార లందులో కొందరే
యుండుదురు మహాత్ము లుర్విపైన.
భావము. పరులకు బోధించు వేళలలో అందరూ వ్యాస పరాశరులే.
వారేధర్మమునైతే బోధింతురో ఆ ధర్మము స్వయముగానాచరించుమహాత్ములు కొందరే ఉందురు.
అమ్మ దయతో
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

వ్రాసినది


