జైశ్రీరామ్.
జైహింద్.27, మార్చి 2026, శుక్రవారం
శ్రీరామ నవమి సందర్భంగా శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి బ్రహ్మశ్రీ రాణీ సదాశివమూర్తి మహోదయులు రచించిన గీతం.
0
comments
25, మార్చి 2026, బుధవారం
బ్రహ్మశ్రీ పండరిరాధాకృష్ణ భక్తిసాధనం నిర్వాహకులు చేసిన మహొత్తమ కార్యాలు.
0
comments
జైశ్రీరామ్.
శ్రీ మాత్రే నమః
భక్తిసాధనమ్
పండరి రాధాకృష్ణ మూర్తి
గారి
సాహిత్య సారస్వత
సేవ .. మెదక్ శివాలయం నుండి ప్రారంభం
***
1997 మెదక్ శివాలయం లో
శ్రీ గుమ్మన్నగారిలక్ష్మీ నరసింహ శర్మ..
Dr అయచితంనటేశ్వర శర్మ గారు
శ్రీ కామారెడ్డి రంగనాథ వాచస్పతి
శ్రీ కొండపాక రంగాచార్యులు వారిచే కవి సమ్మేళనం
***
1998 లో శ్రీ గుమ్మన్న గారి అష్టావధాన సభ
*****
1998 లో కార్తీకంలో
శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారిది అష్టావధానం
*****
1999 లో ఏడుగురు అష్టావధానుల సమ్మేళనము
1) శ్రీ గుమ్మనగారి లక్ష్మీ నరసింహ రామశర్మ
2) శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారు
3) శ్రీ గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి
4) Dr GM రామశర్మ గారు
5) శ్రీ బెజుగామ రామమూర్తి గారు
6) శ్రీ త్రిగుళ్ళ రాధాక్రిష్ణ శర్మ గారు
7) జాతీయ బ్రాహ్మణ సంఘకార్యదర్శి
శ్రీ రావికోటిసుధాకర్ రావు గారీ అధ్యక్షతన
**"**
2000 లో Dr GM రామశర్మ గారిచే అష్టావధానం
*****
2002 లో శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారీ చే
ధార్మిక ప్రవచనం
******
2003 లో సిద్దిపేట బ్రాహ్మణ పరిషత్ లో మళ్ళీ అవధానుల పద్య కవి సమ్మేళనం సమ్మేళనం
1) శ్రీ అష్టకాల నరసింహరామశర్మ గారు
2) శ్రీ గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి గారు
3) శ్రీ త్రిగుళ్ళ రాధాక్రిష్ణ శర్మ గారు
4) శ్రీ శాస్త్రుల రఘురామ శర్మ గోమారం గారు
*****
****†
**†**
శ్రీ మాత్రే నమః
శ్రీ లలితాచంద్రమౌలీశ్వర క్షేత్రము మిట్టపల్లి సిద్దిపేట
ఈ క్షేత్రము 2010 కార్తీక మాసం బహుళ పంచమి రోజున ఆలయ ప్రతిష్ట జరిగింది..
***
2011 లో ప్రవచనాలు
సామవేద స్వహకారము
***
2012 లో సామూహిక
8 ఉపనయనాలు
తన కుమారుడితో పాటు
***
2013 లో శతరుద్రాభిషేకం
*
2014 లో యజుర్వేద స్వహకారం
**
2015 వార్షికోత్సవంలో
Dr GM రామశర్మ గారిచే అష్టావధానం
***
2016 లో పంచ అవధానుల సమ్మేళనం Dr GM రామశర్మ గారు
శ్రీ ముత్యంపేట గౌరీశంకరశర్మ గారు
Dr ముదిగొండ అమరనాథ్ శర్మ గారు
Dr గౌరీభట్ల రఘురామశర్మగారు
A.Bhanu Prakash
**
2017 లో వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా
శతచండీయాగం
**
2018 లో సహస్రరుద్రాభిషేకం
శ్రీ అష్టకాల నరసింహరామశర్మ
గారి సమక్షంలో పద్యకవి సమ్మేళనం... మరియు
Dr GM రామశర్మ గారిచే అష్టావధానం
***
2019 లో నవచండీ పారాయణము
***†
2020 లో లక్షదీపోత్సవం
***
2021 లో శ్రీ అయితగొని వెంకటేశ్వర్లు *శతావధానం
***
2022 లో నవచండీ పారాయణము. లక్ష దీపోత్సవం
*
2023 లో మారేపల్లి వెంకట పట్వర్ధన్ గారిచే శతావధానం
**
2024 లో సంగీతవిభావరి అభిషేకాలు మలుగఅంజయ్య గారిచే ఏక దివస శతావధానం
***
2024 కార్తీకంలో
లలితాదేవి ఆలయ
ప్రతిష్ట...
శ్రీ ఆముదాలమురళి తిరుపతి గారిచే శతావధానం
**
2026 మార్చి వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా Dr వద్దిపర్తి పద్మాకరశర్మగారి శతావధానం
***
వీటితో పాటుగా ప్రతి కార్తీక మాసం బహుళ పంచమి రోజున శివకళ్యాణం
**
****
****
మిట్టపల్లి లో 2021 లో
రెండు రోజుల పాటు 7 అవధానాలు
1) ముత్యంపేట గౌరీశంకరశర్మ.
2) Dr ముదిగొండ అమర్ నాథ్ శర్మ జంట అవధానం
3)చేపూరి శ్రీరామ్ గారు
4) శ్రీ బండ కాడి అంజయ్య గారు
5) శ్రీ తిరుకొవల్లూరు శ్రీహర్ష గారు
6) Dr GM రామశర్మ గారు
7) ఆచార్య దోర్బలప్రభాకరశర్మ గారి సంస్కృత అష్టావధానం
8) శ్రీ అముదాల మురళి గారు
****
ఒకే రోజు పట్వర్ధన్ గారి 6 అవధానాలు... మిట్టపల్లి లలితా చంద్రమౌలీశ్వర క్షేత్రములో
బోయిన్ పల్లి భోళాశంకర మందిరంలో ఒక అవధానం
****
దత్తాత్రేయ గురువు గారి మొదటి అష్టావధానo భోళా శంకర మందిరంలో బోయిన్ పల్లి
****
శాస్త్రుల రఘుపతి గారి మొదటి సారి అవధానం భోళాశంకర మందిరం బోయిన్ పల్లిలో
***
Dr GM రామశర్మ గారు
Dr తాత సందీపశర్మ గారి యుగళ అవధానం . భోళాశంకర మందిరంలో బోయిన్ పల్లి
*****
తిరుకోవల్లూర్ శ్రీహర్ష గారి అష్టావధాన సభ . భోళాశంకర మందిరంలో
****
చుక్కయపల్లి శ్రీదేవి గారి అష్టావధాన సభ
***
శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారిచే
భోళా శంకర మందిరంలో
అష్టావధానం
***
శ్రీ బండకాడి అంజయ్య గారిది
బోయిన్ పల్లి లో ఒకటి
మిట్టపల్లి లో ఒకటి
****
బోయిన్ పల్లి లో రెండు సార్లు
మిట్టపల్లి లో ఒకసారి
గౌరీభట్ల రఘురామ్ శర్మ గారిది
****
Gm రామశర్మ గారిచే 3 సార్లు బోయిన్ పల్లి లో
****
గురువు గారు అష్టకాల నరసింహరామశర్మ గారిది
బోయిన్ పల్లి లో
****
2017 కృష్ణ అష్టమి రోజున
సప్త అవధానుల సమ్మేళనం
****
2017
Dr.రాంభట్ల పార్వతీస్వర శర్మ గారి అష్టావధాన సభ బోయిన్ పల్లి లో
*****
ఒక శివరాత్రికి. బోయిన్ పల్లి లో
Dr గౌరీభట్ల రఘురామశర్మగారు
శ్రీ ఉప్పలదడియం భరత్. శర్మ గారు
. Dr GM రామశర్మ. గారు
శ్రీ ముద్దు రాజయ్య . గారు
Dr అయితగోని వెంకటేశ్వర్లు గారు
పంచ అవధానుల సమ్మేళనం
***
1)శ్రీమతి చుక్కాయ పల్లి శ్రీదేవి
2)Dr వేదాల గాయత్రిదేవిగారిచే
మహిళా దినోత్సవ సందర్భంగా యుగళ అవధానం... మియాపూర్ లో
*****
శ్రీ ముద్దు రాజయ్య గారిచే బోయిన్ పల్లి లో 1అవధానం
మిట్టపల్లి లో ఒకఅవధానం
క్షిప్రం
****
మిట్టపల్లి లో
Dr మలుగ అంజయ్య యాదవ్
శ్రీ త్రిగుళ్ళ శ్రీకాంత్ శర్మ గార్ల యుగళ అవధానం
***"*
బోయిన్ పల్లి RSJ
హాల్ లో కృష్ణాష్టమి రోజున
త్రిగల శతావదానుల సభ
1)ఆచార్య దోర్భల ప్రభాకరశర్మ గారు
2) Dr GM రామశర్మ గారు
3) Dr మలుగ అంజయ్య గారు
*****
2024 డిసెంబర్
గజారోహణ సభ
Rsj హాల్ బోయిన్ పల్లి లో
******
కాశీ దివ్య క్షేత్రంలో
శ్రీ అముదాల మురళిగారు
శ్రీ బండకాడి అంజయ్య గార్లచే యుగళ అవధానం*
జైహింద్.
20, మార్చి 2026, శుక్రవారం
శ్రీమదాది పరాశక్తి! రచన .. చింతా రామకృష్ణారావు.
0
comments
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
🙏🏽
శ్రీమదాది పరాశక్తి!
రచన .. చింతా రామకృష్ణారావు.
సీ. ఓంకార సంభాస! ఐంకార వాగ్యోష! హ్రీంకార, శ్రీంకార హృత్ ప్రకాశ!
పంకేరుహాక్షీ! యలంకారమీవేగ యంకించి నే వ్రాయు శంకృతులను,
సంకాసమేలేని శంకాపహారీ! కుసాంకర్యముల్ బాపు పంకజ ముఖి!
లంకేశపూజ్యుం డలంకారమై సృష్టి నుంకించి చేయంగ నూతమిచ్చి,
గీ. అంకితంబైన భక్తులకండవగుచు,
అంతమొందించి దౌష్ట్యంబు లనితరముగ,
శాంకరీ! లోకములనేలు శంకరనుత!
శ్రీమదాది పరాశక్తి! ప్రేమఁ గనుమ.
సీ. భారతాంబకు నేడు బాధలన్ కలిగించు పాపాత్ము లిలపైమ ప్రబలినారు,
మానవత్వము నేడు మటుమాయమయ్యెను, గౌరవ భావముల్ కరిగె నేడు,
స్త్రీ బాల వృద్ధుల క్షేమంబు నెంచక పీడించు మూర్ఖులు పెరిగినారు,
పూజారులను నేడు పూతికపుల్లగా చూచి కొట్టెడు రక్కసులు జనించ్రి,
సీ. శ్రీమదాదిపరాశక్తి యేమి నీవు
చూచి, చూడక యున్నట్లు వేచినావు?
కాళికాశక్తివై నీవు కదలి రమ్ము,
దుష్ట సంహారమొనరించి తుష్టినిమ్ము.
🙏🏽🙏🏽🙏🏽
జైహింద్.
పంచపాషాణాలు. టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట పద్య ప్రతిపదార్థ తాత్పర్యాదులు.
0
comments
జైశ్రీరామ్.
పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు
యధ్యః ఖడ్గ ధరే ధరే ఖణఖణే ఖర్జూర లుడ్భ్రాడ్భ్రమః
లుడ్భ్రాయాస్పద యడ్గ్ర డడ్గ్ర డడడా షడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
షడ్జానః పురచాతురస్సుర గణేశద్యోతి విద్యోదయః
డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండమృం
డమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన "డ"కారనుతా బసవేశ పాహిమాం!
ప్రతిపదార్థం
బసవేశ = ఓ బసవేశ్వరుడా !
డమరుగ= నీ చర్మవాద్య విశేషమునుండి
జాత =పుట్టిన
డండడ= డండడ అను చప్పుళ్ళతో
మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం
డమృణ మృడండడం =మృడ (శివ)ధ్వనిని వెలార్చెడి మృడండ ....మృండమృణ మొదలయిన శబ్దములు
(అన్ని డ కార ధ్వనులు కావటం విశేషం)
కృతి=చేయుటను
విడంబిత=అనుకరించు
ఘూర్ణిత =తిరుగుడుపడినది
విస్ఫురత్=ప్రకాశించే, తళతళమని మెరిసే
జగత్= లోకమును
ప్రమథన =చిలుకు
తాండవ= నాట్యమునందు
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
డ"కారనుతా= డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
తాత్పర్యము
ఓ బసవేశ్వరుడా ! నువ్వు తాండవ నృత్యము చేసే సమయంలో నీ డమరుకము నుండి డండడ,మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడండమృం డమృం మొదలగు ధ్వనులు పుడుతున్నాయి.ఆ ధ్వనులతో పుట్టిన డమరుక కాంతులలో లోకాలు తిరుగపడుతున్నాయి.. అటువంటి అద్భుతమైన డమరుక ధ్వనులు కలిగిన లోకాలను చిలుకు తాండవ నాట్యమునందు సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !నన్నురక్షించు
విశేషాలు
శివుని చేతిలో నుండునది డమరుకము.
ఆడమరుకమును వాయించుటకు మధ్యలో ఒక కొయ్యముక్క కడతారు.
దానిని మణి అంటారు.
డమరుకమును కదలించినపుడు మణి డమరుకమునకు అటు ఇటు తగిలి డమరుకమును మ్రోగిస్తుంది.
ఆ డమరుక మణుల కాంతులను పాల్కురికి ఈ పద్యంలో వర్ణించాడు.
డమరుకము :
శబ్ద గుణకము ఆకాశము. ఆకాశమునందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్ర జపము చేసినపుడు కాని, వినినపుడు కాని స్పందనలు / తరంగాలు ఏర్పడి. అవి శివ ఢమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పురశ్చరణ చేయుట వలన యోగికి ఆనందము కలిగి తాండవము చేయును. దీనికి గుర్తుగానే శివుడు డమరుకను ధరించునని పెద్దలు చెబుతారు.
3వ పాషాణం.
టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట పద్య ప్రతిపదార్థ తాత్పర్యాదులు.
చ. టటకిట - టట్ట కిట్ట టట - కిట్టట టట్టట కిట్ట టట్ట కిట్
టటకిట టట్టకిట్ట టకి టట్టట టోన్ముఖ టంకృతి స్ఫుటో
త్కట పటహాది నిస్వన వియత్తల దిక్తట తాటితార్భటో
ద్భట పటుతాండవాటన, "ట"కారనుతా! బసవేశ పాహిమామ్!
పద విభాగము.
టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట,
ఉన్ముఖ టంకృతి,
స్ఫుట+ఉత్కట
పటహ+ఆది,
నిస్వన ,
వియత్తల,
దిక్తట,
తాటిత+ఆర్భట+ఉద్భట,
పటుతాండవ+ అటన,
"ట"కారనుతా! బసవేశ ,పాహిమాం!
అన్వయక్రమము.
బసవేశ, టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట, ఉన్ముఖ టంకృతి, స్ఫుట+ఉత్కట .. పటహ+ఆది, నిస్వన ,వియత్తల, దిక్తట, తాటిత+ఆర్భట+ఉద్భట, పటుతాండవ+ అటన, "ట"కారనుతా! పాహిమాం
ప్రతి పదార్థము
బసవేశ = ఓ బసవేశ్వరుడా !
టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట,= టకటక అను చప్పుళ్లతో
ఉన్ముఖ = పైకి విస్తరిస్తున్న
టంకృతి= ఆశ్చర్యముగొలుపు వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు కలిగిన
స్ఫుట= స్పష్టమైన.
ఉత్కట= భయంకరమైన
పటహ=తప్పెట
ఆది= మొదలైన
నిస్వన = ధ్వనులతో
వియత్తల=ఆకాశము
దిక్తట=దిక్+తట= దిక్కుల ప్రదేశములను తాకిన
తాటిత= కొట్టబడిన
ఆర్భట=కేకలతో
ఉద్భట=అధికమైన
పటు తాండవ= నేర్పుకలిగిన నాట్యములో
అటన=సంచరించువాఁడవైన ఓ పరమశివా !
ట"కారనుతా= టకారము అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
తాత్పర్యము
ఓ బసవేశ్వరుడా ! నీ శివతాండవము టకటక అను చప్పుళ్లతో పై పైకి విస్తరిస్తున్న వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు కలిగినది. స్పష్టమైనది. భయంకరమైనది.తప్పెట మొదలైన వాటి ధ్వనులతో ఆకాశము మరియు దిక్కుల అంచులను తాకుచున్నది.అనేక కేకలు కలిగినది.అధికమైనది. నేర్పుకలిగిన నాట్యములోతిరుగువాడా! టకారము అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా ! నన్ను రక్షించు.
4వ పాషాణం.
"ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం మృణఢంమృణ ఢంఢణోద్ధణం
ధణనటన త్వదీయడమరూత మదార్చట ఢంకృతి ప్రజృం
భణ తుటితాభతార గణరాజ దినేశముఖిగ్రహప్రఘుర్
క్షణ గుణతాండవాటన "ఢ"కారనుత బసవేశ పాహిమాం!".
5వ పాషాణం.
పాల్కురికి సోమనాథుని అక్షరాంక పద్యము.
శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
0
comments
జైశ్రీరామ్.
ఓం శ్రీమాత్రే నమః.
శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది.
శా. శ్రీమన్మంగళ శాంభవీ! శుభములన్ జేకూర్చు నిన్ వేడెదన్,
క్షేమంబున్ గొలుపన్ పరాభవయె నీ సేవామహాభాగ్యమున్
బ్రేమన్ మాకిడ వచ్చె, నామము కనన్ భీతిన్ మదిన్ గొల్పునే,
శ్రీమాతా! కనుమా పరాభవములన్ ఛేదించి రక్షింపుమా.
ఉ. స్వాగతమో పరాభవ! ప్రశాంతిని మాకు ననుగ్రహింపగా
రాగదె భారతావనికి, రమ్యమహోజ్వల కాంతి పూర్ణమై,
సాగగనిమ్ము సజ్జముల సన్నుత వర్తన చక్కగాను, నీ
యాగమనమ్ము దుష్టులకు హానిని గూర్చుత, ధర్మనిష్ఠతోన్.
చం. కలుగఁగఁ జేయకమ్మ భువి గణ్యుల కెట్టి పరాభవంబు, నా
పలుకులనెన్ని హైందవము వర్ధిలునట్టులఁ జేయుమమ్మ, ని
స్తులవని నిన్ను నే పొగడ, తోచుమ చక్కగ వత్సరాంతమున్,
వెలుగఁగనిమ్ము మాబ్రతుకు, విశ్వమునన్ వర శాంతి గొల్పుచున్.
ఉ. ఓయి వసంత నీ కొఱకు నోర్పుగఁ జూచితిమింతకాలమున్,
శ్రేయములన్ రచించుటకు శ్రీకరమైన వసంతశోభతో,
న్యాయము నిల్పు దీక్షఁగొని నవ్యకళల్ విరజిమ్ముచున్ కృపన్
ధీయుతులెన్న వచ్చితివి, తేజము గొల్పి శుభాళి గొల్పుమా.
మ. వరమౌ షడ్రుచులిచ్చినావు, ప్రకృతిన్ భాసిల్లగాఁ జేసి, సుం
దర భావామృత మొల్కఁ జేసితివి, విస్తారంబుగా సత్కృతుల్
స్థిరమౌ కీర్తిని గొల్ప నిచ్చితివి యుగాదీ! నీదు శోభల్ సదా
ధరపైనొప్పగ నిల్చి యుండుము, ప్రమోదంబున్ బ్రజన్ నిల్పగన్.
ఉ. మంగళమో యుగాది శుభమంగళముల్ పికపాళికీధరన్,
మంగళమౌ వసంతునకు, మంగళమౌ సహకారపాళికిన్,
మంగళమౌత తెమ్మెరకు, మంగళమౌ సుజనాళికిన్ సదా
మంగళమౌత భారతికి, మంగళముల్ మన దేశమాతకున్.
అమ్మదయతో
చింతా రామకృష్ణారావు.
తే.11 - 3 - 2026.
జైహింద్.
రవీంద్రభారతిలో తెలంగాణా భాషా సంస్కృతిక శాఖ నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం సందర్భంగా పురస్కారం.
0
comments
శా. శ్రీమన్మంగళ శాంభవీ! శుభములన్ జేకూర్చు నిన్ వేడెదన్,
క్షేమంబున్ గొలుపన్ పరాభవయె నీ సేవామహాభాగ్యమున్
బ్రేమన్ మాకిడ వచ్చె, నామము కనన్ భీతిన్ మదిన్ గొల్పునే,
శ్రీమాతా! కనుమా పరాభవములన్ ఛేదించి రక్షింపుమా.
చం. ప్రవర మునీశ్వరార్చిత పరా! భవసంయుతవౌచు సత్ కృపన్
భువికరుదెంచినావు కద పూజ్యముగాను పరాభవాఖ్యవై,
యవనిని కావు మమ్మ మహితాత్ములు కోరువిధంబు శోభిలన్.
ఉ. స్వాగతమో పరాభవ! ప్రశాంతిని మాకు ననుగ్రహింపగా
రాగదె భారతావనికి, రమ్యమహోజ్వల కాంతి పూర్ణమై,
సాగగనిమ్ము సజ్జముల సన్నుత వర్తన చక్కగాను, నీ
యాగమనమ్ము దుష్టులకు హానిని గూర్చుత, ధర్మనిష్ఠతోన్.
చం. కలుగఁగఁ జేయకమ్మ భువి గణ్యుల కెట్టి పరాభవంబు, నా
పలుకులనెన్ని హైందవము వర్ధిలునట్టులఁ జేయుమమ్మ, ని
స్తులవని నిన్ను నే పొగడ, తోచుమ చక్కగ వత్సరాంతమున్,
వెలుగఁగనిమ్ము మాబ్రతుకు, విశ్వమునన్ వర శాంతి గొల్పుచున్.
ఉ. ఓయి వసంత నీ కొఱకు నోర్పుగఁ జూచితిమింతకాలమున్,
శ్రేయములన్ రచించుటకు శ్రీకరమైన వసంతశోభతో,
న్యాయము నిల్పు దీక్షఁగొని నవ్యకళల్ విరజిమ్ముచున్ కృపన్
ధీయుతులెన్న వచ్చితివి, తేజము గొల్పి శుభాళి గొల్పుమా.
మ. వరమౌ షడ్రుచులిచ్చినావు, ప్రకృతిన్ భాసిల్లగాఁ జేసి, సుం
దర భావామృత మొల్కఁ జేసితివి, విస్తారంబుగా సత్కృతుల్
స్థిరమౌ కీర్తిని గొల్ప నిచ్చితివి యుగాదీ! నీదు శోభల్ సదా
ధరపైనొప్పగ నిల్చి యుండుము, ప్రమోదంబున్ బ్రజన్ నిల్పగన్.
ఉ. మంగళమో యుగాది శుభమంగళముల్ పికపాళికీధరన్,
మంగళమౌ వసంతునకు, మంగళమౌ సహకారపాళికిన్,
మంగళమౌత తెమ్మెరకు, మంగళమౌ సుజనాళికిన్ సదా
మంగళమౌత భారతికి, మంగళముల్ మన దేశమాతకున్.

వ్రాసినది


