జైశ్రీరామ్
భక్తిసాధనం నిర్వాహకులు శ్రీ పండరి రాధాకృష్ణ నిర్వహణలో విజయవంతముగా ముగిసిన శ్రీ అయితగోని వేంకటేశ్వర్లు ఏకదినశతావధానము.
శతావధాన ప్రేరకులు బ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణ
శతావధాని శ్రీ శ్రీ ఐతగోయిన వేంకటేశ్వర్లుని భక్తి సాధనం నిర్వాహకులు శ్రీ పండరి రధాకృష్ణ ప్రోత్సహించి ఏకదిన శతావధానమునకు సంసిద్ధుని చేయుటాన్నది వారికి సులభమైనను, అది చేసే అవధాని ఐతగోని వారికి ఎంతటి కష్ట సాధ్యమో అది చేసిన వారికే అర్థమౌతుంది.
ఐనను మొక్కవోని విశ్వాసముతో వారంగెరంగీకరించి ముందునకు వచ్చి శతావధానము చేయుట అనిన కేవలము ఆత్మవిశ్వాసముతో పాటు ఆ జగన్మాతపై వారికి ఉన్న నమ్మకమని చెప్పక తప్పదు.
అష్టావధానమే గంటలతరబడి సాగుచుండుట మనకు తెలిసిన విషయమే. అటువంటిది శతావధానము ఒకరోజులో చేయుట అంతే కాక మధ్య మధ్యలో అప్రస్తుతము చేయుట, చివరిగా ధారణ చేయుట ఊహకే అందనంతటి కష్టసాధ్యమైన పని, ఈ పనిని విజయవంతముగా శ్రీ వేంకటేశ్వర్లుశతావధాని చేయుట అందరికీ ఆశ్చర్యము కలిగించుటలో వింత లేదు. అవధాని సాహసమును ఎంతగా శ్లాఘించినను తక్కువే.
ఈ అవధాని దీర్ఘాయుష్మంతుఁడై ఆంధ్రభాషామాతృ సేవను అవధానమార్గమున నలుదిక్కులా వ్యాపించునట్లు అనేక అవధానములు చేయుఉ, కీర్తిప్రతిష్ఠలు దేశవ్యాప్తముగా సంపాదించుచు తెలుగు తేజమునుకీర్తిని పెంవలెనని నేను ఆశించుచున్నాను.
మనము శ్రీ పండరి రాధాకృష్ణగారిసాహసమును కూడా ప్రశంసించక మానలేము. వారి ఆర్ధికముగా నిరుపేద అయినప్పటికీ భక్తి సంపన్నులగుటయే వారు ఏ కార్యక్రమమునైనను నిర్భయముగా ప్రారంభించుచు దూసుకొని పోవుట మనకందికి ఆశ్చర్యకర విషయము.
ఈ బాషాభిమాని అయినబ్రహ్మశ్రీ పండరి రాధాకృష్ణగారికి భగవంతుఁడు పరిపూర్ణ ఆయుర్దాయముతో పాటు నిరంతరదైవ చింతన బలముతో ఏ పని చేయ తలపెట్టినా నిర్విఘ్నముగా కొనసాగించే సక్తిని ఎల్లప్పుడూ కలుగజేయవలెనని మనము కోరుకుందాము.
స్వస్తి.
జైహింద్.