జైశ్రీరామ్.
97. దీనావనా! జనని. ప్రాణంబె నీవు కద. మానంబు కాతువుగదా.
మానావమానములు నేనెట్లు మోయుదును?. జ్ఞానమ్మునే గొలుపుమా,
యేనాటికైన నిక నీనవ్య తేజమది క్షోణిన్ బ్రభన్ నిలుచుతన్
రాణింపఁ జేయుచుఁ బ్రమాణంబుగా నిలిపి, ప్రాణంబుగా కను సతీ!
భావము.
మానాభిమానప్రదవయిన తల్లీ! శ్రేష్ఠురాలివయిన, నన్ను రాణింపఁజేయుచు
ప్రమాణముగా నిలిపి ప్రాణముగా చూచుకొనెడి ఓ సతీ మాతా!
దీనజనరక్షకురాలివైన ఓ తల్లీ! ఓ జగన్మాతా! మా ప్రాణమే నీవు కదా. మా
మానరక్షకురాలివి కదా. మానావమానములను నేనేవిధముగా
మ్రోయగలనమ్మా?నాకు జ్ఞానమును ప్రసాదించుము. ఏనాటివరకయినను ఈ
సృష్టి నీ నిత్యనూతనమయిన ప్రకాశమే భూమిపై ప్రభతో నిలుచు గాక.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.