గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఏప్రిల్ 2025, బుధవారం

దత్తపీఠాధిపతులద్వారా చిరంజీవి అన్నపరెడ్డి అనిరుద్ధునకు బంగారు పతకము

 జైశ్రీరామ్.

సహృదయమణి, రైతుబంధుకవి, నాకు ఆత్మీయులు ఐన 

శ్రీ అన్నపరెడ్డి సత్యనారాయ్ణరెడ్డిగారి పౌత్రుఁడు 

५ సంవత్సరముల వయసుగల

చి. అన్నపరెడ్డి అనిరుధ్ 

భగవద్గీత లోని 700 శ్లోకాలు ధారణ చేసి 

దత్తపీఠం వారు నిర్వహించిన ఫైనల్ పరీక్ష లో 

ఉత్తమ శ్రేణి (distinction) పొందాడు. 

ఈ రోజు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, 

దత్తపీఠం, మైసూరు వారు దత్తపీఠం, దిండిగల్ 

హైదరాబాద్ లో 

ప్రశంసా పత్రం, బంగారు పతకం స్వయంగా అందజేసారు.

చిరంజీవి అనిరుద్ధు కు అభినందనపూర్వక ఆశీస్సులు తెలియఁజేస్తూ,

శ్రీమతిమాణిక్యాంబా శ్రీ సత్యనారాయణ దంపతులకు 

వారి కుమారునకు కోడలికి నా శుభాకాంక్షలు తెలియఁజేస్తున్నాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.