జైశ్రీరామ్.
శ్లో. పీత్వా కర్దమపానీయం - భేకో రటరటాయతే!
పక్వం చూతరసం పీత్వా - గర్వం నాయాతి కోకిలః!!
తే.గీ. బురదలోనీరు త్రాగుచున్ పొగరుతోడ
బెకబెకంచును వాగును వింత యిదియె,
పక్వచూతఫలరసము వరలఁ గొనియు
కూయు కోకిల, గర్వంబు కూడదిలను.
భావము. బురదలో నీరు తాగి కూడా కప్ప పొగరుతో బెకబెకమంటుంది.
బాగాపండిన మామిడి రసం తాగి కూడా కోకిల గర్వాన్ని పొందదు.
మనం ఎప్పుడు గర్వాన్ని పొందకూడదు అని భావము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.