గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, డిసెంబర్ 2008, మంగళవారం

సహస్ర నామ తత్తుల్యం

రామ.....రామ......రామ....అని మూడుమారులుచ్చరించినచో అది వేయిమారులు రామనామోచ్చారణ చేసినట్లేననీ, తత్ ఫలితం లభిస్తుందనీ ఒకశ్లోకముంది చూద్దామా?

శ్లోకము:-
శ్రీ రామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం
రామ నామ వరాననే.

ఐతే ఏవిధంగా ముమ్మారు రామనామోచ్చారణ చేస్తే వేయిమారులు చేసినట్లవుతుంది? అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆలోచించగా నాకొక లాజిక్కు దీనిలో వున్నట్టుగా శ్రీ భాష్యం అప్పలాచార్యులవారు సెలవిచ్చిన విషయం గుర్తుకొచ్చి అది మీముందుచకుండా వుండలేకపోతున్నాను. మీకూ తెలిసే ఉండవచ్చు. ఐనా చూడగలరు.

రామ అనే అక్షరాల్లో
రా లొని రకారం అంతస్థములలో రెండవాక్షరం. దానిని రెండు సంఖ్యగా గ్రహించాలి.
రామ లో మ అనే అక్షరం పంచమవర్గమయిన పవర్గ పంచమాక్షరం. దీనిని ఐదు సంఖ్యగా గ్రహించాలి.
రామ = 2 * 5 = 10. ఎలాగౌతుందంటారా? చూడండి.
యే = 2 .
బీ = 5 అయిన
యేబీ = ఎంత? అనగానే యే * బీ > 2 * 5 = 10 . అని మనం లెక్క చెప్పగలుగుతున్నాం కదా. అలాగే
రా = 2 . మ = 5 . > రామ = 2 * 5 = 10 . అవుతుంది కదా!
రామ,రామ,రామ అని ముమ్మారు పలికితే రామ * రామ * రామ > 10 * 10 * 10 = 1000. అవుతోంది
ఎంత అద్భుతంగా వుంది ఆలోచన? వివరంగా అర్థమయేవిధంగా చెప్పగలిగాననుకొంటాను.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.