గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, నవంబర్ 2008, ఆదివారం

సెన్సార్ బోర్డును సెన్సార్ చెయ్యండి.

మాతృ దేవోభవ! పితృ దేవో భవ! అనే మాటలు మనకి మురళీ గానంలాగా వినిపిస్తాయి. నేటి సినీమా, టీ. వీ. చిత్రాలలో కనిపిస్తున్న దౌర్భాగ్య సంభాషణలూ, దౌర్భాగ్య సన్నివేశాలూ, సభ్య సమాజానికి కీడు కలిగించడమే కాక ఎంద రెందరినో ఆవేదనకు గురి చేస్తున్నాయి. హృదయం లోంచొచ్చిన ఈ ఆవేదన 99% ప్రేక్షకుల స్పందన. బిడ్డలను గన్న తల్లి దండ్రులు, పాఠాలు నేర్పే గురువులూ, పెక్కురు విద్యార్థులూ, సమాజంలో మంచినే కాంక్షించే మహనుభావులూ, విశ్వనాధ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలూ, లోక్ సత్తా వంటి నిజాయితీని నిలపాలనుకొనే ప్రముఖ పార్టీల నాయకులగు జయప్రకాష్ వంటి నాయకులూ, ఎందరో మహిళా మణులూ, చలన చిత్రాలలోను, టీ.వీ. లలోనూ, కనిపించే కొన్ని సన్నివేశాలకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది నగ్న సత్యము.
కొందరు నిర్మాతలూ, దర్శకులూ, చిత్ర నిర్మాణంలో ధన సంబంధాన్నే తప్ప మానవ సంబంధాన్ని మచ్చుకైనా గుర్తుంచుకోవడం లేదు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని వారికి తోచిన రీతిలో చిత్ర నిర్మాణంలో ఉపయోగించెస్తున్నారే తప్ప ఆ చిత్రాన్ని చూచే ప్రేక్షకులపై అది యెంత ప్రభావం చూపుతుందన్న విషయం కొంచెమైనా ఆలోచించకపోవడం విచారకరం.
మనం బ్రతకడంలో తప్పు లేదు. మన బ్రతుకు కోసం జీవనాధారాన్నెంచుకోవడంలో తప్పు లేదు. ఐతే మన బ్రతుకు వల్ల గాని, మన మెంచుకొన్న జీవనాధార బ్రతుకు మార్గం వల్ల గాని మనం బ్రతుకుతున్న సమాజంలోనున్న మరొకరికి ఏవిధమైన నష్టన్నికాని, హానిని కాని కలిగించ కూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదుకదా? వ్యాపారులైన నిర్మాతల వల్ల తప్పు పూర్తిగా లేదు. ఎందుకంటే బోలెడు అప్పులు చేసి చిత్ర నిర్మాణం చేస్తారు. ఆ డబ్బు తిరిగి రాబట్టుకోడానికి అనేక జిమ్మిక్కులు చేస్తారు. ఐతే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్టివ్వకుండా చిత్రాన్ని విడుదల చేయ లేరు కదా! మరి యీ సెన్సారు బోర్డు యేం చేస్తోంది?
ఈ సెన్సార్ బోర్డుకి కూడా నియమ నిబంధనలున్నాయి. వాటిలోనూ వారి అభిప్రాయాల కనుగుణంగా సమర్ధించుకోడానికి వీలుగా బోలెడు లొసుగులున్నాయి. అందుచేతనే యీ సమాజానికి యీ దౌర్భాగ్యం దాపురించింది.
మానవ హక్కులను కాపాడే సంస్థలున్నాయి. మహిళా హక్కులను కాపాడే సంస్థలున్నాయి. ఈ సంస్థలనుండి ఎంపిక చేసిన వ్యక్తులనుకూడా సెన్సార్ బోర్దు సభ్యులుగా చేస్తే యేమైనా మార్పు రావచ్చునేమో. ఈ ఆలోచన ప్రభుత్వానికి కలిగేదెప్పుడూ ? కలిగించేదెవ్వరూ....? ఈ కలి యుగంలో కృత యుగాన్ని చూడగలిగే దెప్పుడూ....? ఏమో .... వేచి చూడడం తప్ప చేయగలిగిందేముంది........? మీరూ ఆలోచించండి .
మాతృ దేవోభవ! పితృ దేవో భవ! అనే మాటలు మనకి మురళీ గానంలాగా వినిపిస్తాయి. నేటి సినీమా, టీ. వీ. చిత్రాలలో కనిపిస్తున్న దౌర్భాగ్య సంభాషణలూ, దౌర్భాగ్య సన్నివేశాలూ, సభ్య సమాజానికి కీడు కలిగించడమే కాక ఎంద రెందరినో ఆవేదనకు గురి చేస్తున్నాయి. హృదయం లోంచొచ్చిన ఈ ఆవేదన 99% ప్రేక్షకుల స్పందన. బిడ్డలను గన్న తల్లి దండ్రులు, పాఠాలు నేర్పే గురువులూ, పెక్కురు విద్యార్థులూ, సమాజంలో మంచినే కాంక్షించే మహనుభావులూ, విశ్వనాధ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలూ, లోక్ సత్తా వంటి నిజాయితీని నిలపాలనుకొనే ప్రముఖ పార్టీల నాయకులగు జయప్రకాష్ వంటి నాయకులూ, ఎందరో మహిళా మణులూ, చలన చిత్రాలలోను, టీ.వీ. లలోనూ, కనిపించే కొన్ని సన్నివేశాలకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది నగ్న సత్యము.
కొందరు నిర్మాతలూ, దర్శకులూ, చిత్ర నిర్మాణంలో ధన సంబంధాన్నే తప్ప మానవ సంబంధాన్ని మచ్చుకైనా గుర్తుంచుకోవడం లేదు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని వారికి తోచిన రీతిలో చిత్ర నిర్మాణంలో ఉపయోగించెస్తున్నారే తప్ప ఆ చిత్రాన్ని చూచే ప్రేక్షకులపై అది యెంత ప్రభావం చూపుతుందన్న విషయం కొంచెమైనా ఆలోచించకపోవడం విచారకరం.
మనం బ్రతకడంలో తప్పు లేదు. మన బ్రతుకు కోసం జీవనాధారాన్నెంచుకోవడంలో తప్పు లేదు. ఐతే మన బ్రతుకు వల్ల గాని, మన మెంచుకొన్న జీవనాధార బ్రతుకు మార్గం వల్ల గాని మనం బ్రతుకుతున్న సమాజంలోనున్న మరొకరికి ఏవిధమైన నష్టన్నికాని, హానిని కాని కలిగించ కూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదుకదా? వ్యాపారులైన నిర్మాతల వల్ల తప్పు పూర్తిగా లేదు. ఎందుకంటే బోలెడు అప్పులు చేసి చిత్ర నిర్మాణం చేస్తారు. ఆ డబ్బు తిరిగి రాబట్టుకోడానికి అనేక జిమ్మిక్కులు చేస్తారు. ఐతే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్టివ్వకుండా చిత్రాన్ని విడుదల చేయ లేరు కదా! మరి యీ సెన్సారు బోర్డు యేం చేస్తోంది?
ఈ సెన్సార్ బోర్డుకి కూడా నియమ నిబంధనలున్నాయి. వాటిలోనూ వారి అభిప్రాయాల కనుగుణంగా సమర్ధించుకోడానికి వీలుగా బోలెడు లొసుగులున్నాయి. అందుచేతనే యీ సమాజానికి యీ దౌర్భాగ్యం దాపురించింది.
మానవ హక్కులను కాపాడే సంస్థలున్నాయి. మహిళా హక్కులను కాపాడే సంస్థలున్నాయి. ఈ సంస్థలనుండి ఎంపిక చేసిన వ్యక్తులనుకూడా సెన్సార్ బోర్దు సభ్యులుగా చేస్తే యేమైనా మార్పు రావచ్చునేమో. ఈ ఆలోచన ప్రభుత్వానికి కలిగేదెప్పుడూ ? కలిగించేదెవ్వరూ....? ఈ కలి యుగంలో కృత యుగాన్ని చూడగలిగే దెప్పుడూ....? ఏమో .... వేచి చూడడం తప్ప చేయగలిగిందేముంది........? మీరూ ఆలోచించండి . మాతృ దేవోభవ! పితృ దేవో భవ! అనే మాటలు మనకి మురళీ గానంలాగా వినిపిస్తాయి. నేటి సినీమా, టీ. వీ. చిత్రాలలో కనిపిస్తున్న దౌర్భాగ్య సంభాషణలూ, దౌర్భాగ్య సన్నివేశాలూ, సభ్య సమాజానికి కీడు కలిగించడమే కాక ఎంద రెందరినో ఆవేదనకు గురి చేస్తున్నాయి. హృదయం లోంచొచ్చిన ఈ ఆవేదన 99% ప్రేక్షకుల స్పందన. బిడ్డలను గన్న తల్లి దండ్రులు, పాఠాలు నేర్పే గురువులూ, పెక్కురు విద్యార్థులూ, సమాజంలో మంచినే కాంక్షించే మహనుభావులూ, విశ్వనాధ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలూ, లోక్ సత్తా వంటి నిజాయితీని నిలపాలనుకొనే ప్రముఖ పార్టీల నాయకులగు జయప్రకాష్ వంటి నాయకులూ, ఎందరో మహిళా మణులూ, చలన చిత్రాలలోను, టీ.వీ. లలోనూ, కనిపించే కొన్ని సన్నివేశాలకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది నగ్న సత్యము.
కొందరు నిర్మాతలూ, దర్శకులూ, చిత్ర నిర్మాణంలో ధన సంబంధాన్నే తప్ప మానవ సంబంధాన్ని మచ్చుకైనా గుర్తుంచుకోవడం లేదు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని వారికి తోచిన రీతిలో చిత్ర నిర్మాణంలో ఉపయోగించెస్తున్నారే తప్ప ఆ చిత్రాన్ని చూచే ప్రేక్షకులపై అది యెంత ప్రభావం చూపుతుందన్న విషయం కొంచెమైనా ఆలోచించకపోవడం విచారకరం.
మనం బ్రతకడంలో తప్పు లేదు. మన బ్రతుకు కోసం జీవనాధారాన్నెంచుకోవడంలో తప్పు లేదు. ఐతే మన బ్రతుకు వల్ల గాని, మన మెంచుకొన్న జీవనాధార బ్రతుకు మార్గం వల్ల గాని మనం బ్రతుకుతున్న సమాజంలోనున్న మరొకరికి ఏవిధమైన నష్టన్నికాని, హానిని కాని కలిగించ కూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదుకదా? వ్యాపారులైన నిర్మాతల వల్ల తప్పు పూర్తిగా లేదు. ఎందుకంటే బోలెడు అప్పులు చేసి చిత్ర నిర్మాణం చేస్తారు. ఆ డబ్బు తిరిగి రాబట్టుకోడానికి అనేక జిమ్మిక్కులు చేస్తారు. ఐతే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్టివ్వకుండా చిత్రాన్ని విడుదల చేయ లేరు కదా! మరి యీ సెన్సారు బోర్డు యేం చేస్తోంది?
ఈ సెన్సార్ బోర్డుకి కూడా నియమ నిబంధనలున్నాయి. వాటిలోనూ వారి అభిప్రాయాల కనుగుణంగా సమర్ధించుకోడానికి వీలుగా బోలెడు లొసుగులున్నాయి. అందుచేతనే యీ సమాజానికి యీ దౌర్భాగ్యం దాపురించింది.
మానవ హక్కులను కాపాడే సంస్థలున్నాయి. మహిళా హక్కులను కాపాడే సంస్థలున్నాయి. ఈ సంస్థలనుండి ఎంపిక చేసిన వ్యక్తులనుకూడా సెన్సార్ బోర్దు సభ్యులుగా చేస్తే యేమైనా మార్పు రావచ్చునేమో. ఈ ఆలోచన ప్రభుత్వానికి కలిగేదెప్పుడూ ? కలిగించేదెవ్వరూ....? ఈ కలి యుగంలో కృత యుగాన్ని చూడగలిగే దెప్పుడూ....? ఏమో .... వేచి చూడడం తప్ప చేయగలిగిందేముంది........? మీరూ ఆలోచించండి .


మాతృ దేవోభవ! పితృ దేవో భవ! అనే మాటలు మనకి మురళీ గానంలాగా వినిపిస్తాయి. నేటి సినీమా, టీ. వీ. చిత్రాలలో కనిపిస్తున్న దౌర్భాగ్య సంభాషణలూ, దౌర్భాగ్య సన్నివేశాలూ, సభ్య సమాజానికి కీడు కలిగించడమే కాక ఎంద రెందరినో ఆవేదనకు గురి చేస్తున్నాయి. హృదయం లోంచొచ్చిన ఈ ఆవేదన 99% ప్రేక్షకుల స్పందన. బిడ్డలను గన్న తల్లి దండ్రులు, పాఠాలు నేర్పే గురువులూ, పెక్కురు విద్యార్థులూ, సమాజంలో మంచినే కాంక్షించే మహనుభావులూ, విశ్వనాధ వంటి ప్రముఖ దర్శక నిర్మాతలూ, లోక్ సత్తా వంటి నిజాయితీని నిలపాలనుకొనే ప్రముఖ పార్టీల నాయకులగు జయప్రకాష్ వంటి నాయకులూ, ఎందరో మహిళా మణులూ, చలన చిత్రాలలోను, టీ.వీ. లలోనూ, కనిపించే కొన్ని సన్నివేశాలకు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇది నగ్న సత్యము.
కొందరు నిర్మాతలూ, దర్శకులూ, చిత్ర నిర్మాణంలో ధన సంబంధాన్నే తప్ప మానవ సంబంధాన్ని మచ్చుకైనా గుర్తుంచుకోవడం లేదు. వారి నిర్మాణ నైపుణ్యాన్ని జ్ఞానాన్ని వారికి తోచిన రీతిలో చిత్ర నిర్మాణంలో ఉపయోగించెస్తున్నారే తప్ప ఆ చిత్రాన్ని చూచే ప్రేక్షకులపై అది యెంత ప్రభావం చూపుతుందన్న విషయం కొంచెమైనా ఆలోచించకపోవడం విచారకరం.
మనం బ్రతకడంలో తప్పు లేదు. మన బ్రతుకు కోసం జీవనాధారాన్నెంచుకోవడంలో తప్పు లేదు. ఐతే మన బ్రతుకు వల్ల గాని, మన మెంచుకొన్న జీవనాధార బ్రతుకు మార్గం వల్ల గాని మనం బ్రతుకుతున్న సమాజంలోనున్న మరొకరికి ఏవిధమైన నష్టన్నికాని, హానిని కాని కలిగించ కూడదనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించకూడదుకదా? వ్యాపారులైన నిర్మాతల వల్ల తప్పు పూర్తిగా లేదు. ఎందుకంటే బోలెడు అప్పులు చేసి చిత్ర నిర్మాణం చేస్తారు. ఆ డబ్బు తిరిగి రాబట్టుకోడానికి అనేక జిమ్మిక్కులు చేస్తారు. ఐతే సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్టివ్వకుండా చిత్రాన్ని విడుదల చేయ లేరు కదా! మరి యీ సెన్సారు బోర్డు యేం చేస్తోంది?
ఈ సెన్సార్ బోర్డుకి కూడా నియమ నిబంధనలున్నాయి. వాటిలోనూ వారి అభిప్రాయాల కనుగుణంగా సమర్ధించుకోడానికి వీలుగా బోలెడు లొసుగులున్నాయి. అందుచేతనే యీ సమాజానికి యీ దౌర్భాగ్యం దాపురించింది.
మానవ హక్కులను కాపాడే సంస్థలున్నాయి. మహిళా హక్కులను కాపాడే సంస్థలున్నాయి. ఈ సంస్థలనుండి ఎంపిక చేసిన వ్యక్తులనుకూడా సెన్సార్ బోర్దు సభ్యులుగా చేస్తే యేమైనా మార్పు రావచ్చునేమో. ఈ ఆలోచన ప్రభుత్వానికి కలిగేదెప్పుడూ ? కలిగించేదెవ్వరూ....? ఈ కలి యుగంలో కృత యుగాన్ని చూడగలిగే దెప్పుడూ....? ఏమో .... వేచి చూడడం తప్ప చేయగలిగిందేముంది........? మీరూ ఆలోచించండి .

కందము:-
ధనమును గడియించుటకై
గుణమును విడువంగ రాదు.గురు, పితరులపై
వినయము బాపెడి చిత్రము
కనుటన దౌర్భాగ్యమయ్య! కాల్పగ వలదే ? Print this post

2 comments:

krishna rao jallipalli చెప్పారు...

సెన్సారు బోర్డు మీదా, వరకట్నాల మీదా ఉపన్యాసాలు, చర్చలు, మీటింగులు, సమావేశాలు, రాతలు, ఇప్పుడు బ్లాగులు. శుద్ధ టైం వేస్టు.

అజ్ఞాత చెప్పారు...

ఈ వ్యాసం నాలుగు సార్లు పడినట్టుంది రావు గారూ, గమనించగలరు. బహుశా పేస్టు చేసేటపుడు అలా పడి ఉండొచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.