జైశ్రీరామ్.
శ్లో. ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనమ్.(ఈశావాస్యోపనిషత్ ౧)
తే.గీ.. ఈశ్వరుని సృష్టిలోనుండు నీ సతతము
నీశ్వరునికే సదా చెల్లు నీశ్వరుండె
నుండునంతట ననుచు నీవుండు మెపుడు,
పరుల ధనము నాశింపకు, వరగుణాఢ్య!
భావము. జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతునిచే నింపబడాలి.
అలాంటి త్యాగబుద్ధితో ఈ లోకాన్ని అనుభవించు. ఎవరి ధనాన్నీ ఆశించకు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.