జైశ్రీరామ్.
శ్లో. ఆహార నిద్రా భయ మైధునాని
సామాన్యమేతత్పశుభిర్నరాణాం
జ్ఞానంహి తేషా మధికో విశేషః
జ్ఞానేన హీనః పశుభిస్సమానః.
(ఉత్తర గీత 2-44)
తే.గీ. నిద్ర, భయ, మైధు నాహార క్షుద్రగుణము
లరయ పశువులన్ మనుజుల నాశ్రయించి
యుండు, జ్ఞానంబు నరునిలో నుండు, జ్ఞాన
హీన నరుఁడు పశు సముఁడు, భానుతేజ!
భావము. ఆహారము నిద్ర భయము మైధునము నాలుగును ప్రాణి ధర్మములు.
ఇవి జంతుకోటికి ఎంతటి అవసరమో మానవులకును ఆంతియే. అయిననిందు
విశేష మేమిటనిన మానవులకు జ్ఞానమనునది అధికముగా నున్నది.
పశువుల కది లేదు. అందువలన జ్ఞానహీనుడు పశు సమానుడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.