జైశ్రీరామ్.
శ్లో. ఇంద్రియాణాం ప్రసంగేన - దోషమృచ్ఛత్యసంశయమ్ |
సంనియమ్య తు తాన్యేవ - తతః సిద్ధిం నియచ్ఛతి ||
(మనుస్మృతి)
తే.గీ. ఇంద్రి యాకర్షితుఁడు దోషమెలనిఁ జేయు,
నిల జితేంద్రియుఁడన శుభకలితుఁడె యగు,
నింద్రియములఁ జయించుమో సాంద్ర సుగుణ!
దోషమందక గొప్ప సంతోషము కను.
భావము. ఇంద్రియాల ఆకర్షణకు లోనయినవాడు పాపం చేస్తాడు. వాటిని
అదుపులో పెట్టినవాడు మంచి ఫలితాన్ని పొందుతాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.