గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2012, శనివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 132.

జైశ్రీరామ్.
శ్లో:-
సంతుష్టో భార్యయాభర్తా, భర్తా భార్యా తధైవచ,
యస్మిన్నేవ కులేనిత్యం కళ్యాణం తత్రవై ధృవం 
గీ:-
భార్య భర్తను, భర్తయు భార్యనెపుడు
గౌరవంబుగ నేయింట గాంతు రట్టి
గృహము స్వర్గంబు భువిపైన, కేళిసల్పు
నట్టి గృహమున శుభలక్ష్మి పట్టుపట్టి. 
భావము:-
ఏ యింటిలో భార్యా భర్తలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకొంటూ, ప్రేమానురాగాలతో సంతుష్టులుగా ఉంటారో ఆ యిల్లు నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా విలసిల్లును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు.
అవును భార్యా భర్తలు సరిగా లేకపోతే , ఆ ఇంట పిల్లలు కుడా క్రమశిక్షణ లేకుండా పెరిగి ఇబ్బందుల పాలౌతారు. చాలా మంచి శ్లోకం చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.