గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, డిసెంబర్ 2012, ఆదివారం

శ్రీరామునిచే రామలింగ ప్రతిష్ఠాపన: పండిత నేమాని


జైశ్రీరాం
పండిత నేమాని
శ్రీమదధ్యాత్మ రామాయణమునుండి
శ్రీరామునిచే రామలింగ ప్రతిష్ఠాపన:

శ్రీరాముండు పయోధి తీరమున సుక్షేత్రమునన్ భక్తితో
శ్రీరామేశ్వరలింగమున్ నిలిపి పూజించెన్ మహాదేవునిన్
గౌరీ వల్లభు భక్తలోక వరదున్ కైవల్య యోగప్రదున్
కారుణ్యామృత సాగరున్ భువన రక్షాదక్షునిన్ ద్ర్యక్షునిన్ 

నమస్తే సోమాయ త్రిభువన శరణ్యాయచ నమో
నమస్తే రుద్రాయ త్రిదశనుత విజ్ఞాననిధయే
నమస్తే శర్వాయ ప్రమథగణ వంద్యాయచ నమో
నమస్తే తామ్రాయ శ్రిత భవభయఘ్నాయచ నమః

నమస్తే సదా లోకనాథార్చితాయ
నమస్తే గిరీశాయ నాదప్రియాయ
నమస్తే భవానీ మనస్సంస్థితాయ
నమశ్శంభవే విశ్వనాథాయ తుభ్యం
 
నమో హిరణ్యబాహవే సనాతనాయ తేనమః
నమశ్శివాయ సర్వభూత నాయకాయ తేనమః
నమో హరాయ నందివాహనాయ శూలినే నమః
నమో భవాయ నాగభూషణాయ శంభవే నమః 
పండిత నేమాని.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
భక్తి పారవస్యాన్ని కలిగించె రామ లింగ ప్రతిష్టాపన పద్యములు చాలా బాగున్నాయి.శ్రీ పండితుల వారికి ధన్య వాదములు + కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.