గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2024, శుక్రవారం

కాంతల్ కన్యలె సంతతిన్ గలిగియున్, కల్యాణమూర్తుల్ ధరన్. సమస్యకు .. నా పూరణ. తే.10 - 7 - 2024

 జైశ్రీరామ్.

శ్రీమతి బులుసు అపర్ణ ద్విశతావధాని హర్షవల్లిలో చేసిన ద్విశతావధానంలో 

నేనిచ్చిన సమస్యకు నా పూరణ.

శా.  సంతానంబును గల్గినంత వనితల్ సంతున్ సదా కావగా

భ్రాంతుల్ వీడుచు లోకమాతయగుచున్ నిత్యంబు యోచించుచున్,

శాంతిన్వెల్గెడి కన్యకాజననితో సాదృశ్యమై యొప్పు నా

కాంతల్ కన్యలె సంతతిన్ గలిగియున్, కల్యాణమూర్తుల్ ధరన్.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.