గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మార్చి 2025, బుధవారం

భూమిపైకి క్షేమంగా చేరిన భారత సంతతికి చెందిన నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్, (Sunita Williams) ఆమె సహచరుడు బుచ్ విల్‌మోర్‌ లకు అభినందన పూర్వక స్వాగతం.

 జైశ్రీరామ్.

గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన నాసా (NASA) వ్యోమగామి సునీతా విలియమ్స్, (Sunita Williams) ఆమె సహచరుడు బుచ్ విల్‌మోర్‌లు (Butch Wilmore)9 నెలల అనంతరం భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటలకు తిరుగుప్రయాణమయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ కాప్సూల్ భూవాతావరణంలోకి బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకుపారాచ్యూట్ల సాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్‌ సురక్షితంగా చేరారు. 

ఈ విషయానికి ప్రపంచదేశాలన్నీ చాలా సంతోషీస్తున్నాయి.

మనకైతే మన బిలియంస్ క్శేమంగా చేరినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. వ్యోమగాముకను క్షేమంగా చేరేలా చేసిన శాస్త్రవేత్తలకృశ్గిని అభినందిస్తూ ఆ పరమాత్మకు కృతజ్ఞతలతో పాదాభివందనము చేయుచున్నాను.

జైహింద్.

 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.