గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, మార్చి 2025, శనివారం

పరవాచ్యేషు నిపుణః ... మేలిమి బంగారం మన సంస్కృతి

జై శ్రీరామ్.

శ్లో.  పరవాచ్యేషు నిపుణః   -  సర్వో భవతి సర్వదా ।

ఆత్మవాచ్యం న జానతి   -  జానన్నపి చ గుహ్యతే ॥

తే.గీ.  పరుల దోషము లందరున్ బట్టువారె,

యాత్మ దోషంబు లెఱిఁగియు నాత్మలోనె 

దాచుకొందురు,  తప్పంచు తలపఁబోరు.

దోషములకాత్మ సాక్షియై దూరుచుండు.

భావము. ఇతరుల దోషాల నెంచి చూపడంలో అందరూ అన్ని వేళలా నిపుణులే. 

కాని తమ దోషాలను తెలుసుకోలేరు. ఒకవేళ తెలిసి నప్పటికినీ తెలియనట్లే 

ప్రవర్తిస్తారు.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.