గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, అక్టోబర్ 2022, బుధవారం

మమైవాంశో జీవలోకే - ...15 - 7...//.... శరీరం యదవాప్నోతి- , , .15 - 8,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

 జైశ్రీరామ్

|| 15-7 ||

శ్లో.  మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః|

మనఃషష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి.

తే.గీ.  నా సనాతనాంశయె జీవి, యాశ గొలిపి

ప్రకృతి నుండి యాకర్షించు భ్రమనుచెంది

యింద్రియంబులవశమయి యిలను చెలగు

జీవి ననుచూడజాలమిన్ చేరలేడు.

భావము.

సనాతనమైన నా అంశే జీవలోకములో జీవుడిగా మారి, ప్రకృతినుండి 

మనస్సుతో కూడిన ఆరు ఇంద్రియాలను ఆకర్షిస్తుంది.

|| 15-8 ||

శ్లో.  శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః|

గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్.

తే.గీ. దేహమీశుండు పొందినన్, దేహమువిడి

పోయినప్పుడునింద్రియ మాయఫలము

లంది గొనిపోవుచుండుననవరతము,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

ఈశ్వరుడు శరీరాన్ని పొందినప్పుడూ, విడిచినప్పుడూ వాయువు పూలలోంచి 

వాసనను తీసుకుపోయే విధముగా ఈ ఆరింటిని తీసుకొని ప్రయాణిస్తాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.