గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, అక్టోబర్ 2022, గురువారం

ఉదాసీనవదాసీనో - ...14 - 23...//.....సమదుఃఖసుఖః స్వస్థః - , , .14 - 24,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

 జైశ్రీరామ్.

|| 14-23 ||

శ్లో.  ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే|

గుణా వర్తన్త ఇత్యేవం యోవతిష్ఠతి నేఙ్గతే.

తే.గీ. తెలియు నెవ్వడు చర్యలు త్రిగుణములవ

నుచును, తానుదాసీనుడై యచలితమతి

నుండునో చిదాకాశ మందుండు వాడు, 

త్రిగుణములనుజయించిన ధీరుడతడు.

భావము.

ఎవడు ప్రకృతిగుణములే ప్రవర్తించుచున్నవని తెలిసి, ఉదాసీనుడై ఉండి, 

త్రిగుణములచే చలింపక చిదాకాశ స్వరూపస్థితిలో సదా విలసిల్లుచుండునో 

వాడే త్రిగుణాతీతుడు.

|| 14-24 ||

శ్లో.  సమదుఃఖసుఖః స్వస్థః సమలోష్టాశ్మకాఞ్చనః|

తుల్యప్రియాప్రియో ధీరస్తుల్యనిన్దాత్మసంస్తుతిః.

తే.గీ.  దుఃఖ సుఖములన్ సమముగా, తోచు నెవని

కిలను మట్టియు పుత్తడి నెంచ నొకటి

గా కనునెవండు, తిట్లుపొగడ్తలొక్క

టిగనె నెన్ను గుణాతీతునిగగణించు.

భావము.

సమ దు:ఖ అనంత చిదాకాశ స్వరూపమందు స్థిరుడై, సుఖదు:ఖములందు 

సమముగనుండి, మట్టిని, రాతిని, బంగారమును సమముగ జూచుచు, ఇష్టానిష్ట 

వస్తుప్రాప్తితో సమచిత్తమునే కలిగి దూషణభూషణములందు చలింపక, ధీరుడై 

ఎవడు విలసిల్లునో వాడే త్రిగుణాతీతుడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.