గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, అక్టోబర్ 2022, శుక్రవారం

మానావమానయోస్తుల్య - ...14 - 25...//....మాంచయోవ్యభిచారేణ- , , .14 - 26,,,//...చతుర్దశోధ్యాయః - గుణత్రయవిభాగయోగః

 జైశ్రీరామ్.

|| 14-25 ||

శ్లో.  మానావమానయోస్తుల్యస్తుల్యో మిత్రారిపక్షయోః|

సర్వారమ్భపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే.

తే.గీ.  ఎవడు మానావమానము లెంచు సమము

శత్రుమిత్రులన్ సమముగ ధాత్రి గనుచు

సర్వకర్మలారంభముల్ చక్కగ విడి

చిమెలగు నతడు జితగుణుడు మహి పార్థ!

భావము.

మానావమానములందు సమచిత్తముతోనుండి, శత్రుమిత్రులందు సముడై 

సర్వ కర్మలను పరిత్యజించి ఎవడు సర్వదా చిదాకాశ దైవప్రఙ్ఞతో 

ప్రకాశించుచుండునో వాడే త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు.

|| 14-26 ||

శ్లో.  మాంచయోవ్యభిచారేణ భక్తియోగేన సేవతే|

స గుణాన్సమతీత్యైతాన్బ్రహ్మభూయాయ కల్పతే.

తే.గీ. భక్తితోనన్నెవడిలను పరవశించి

కొలుచు త్రిగుణంబులన్  దాను గెలుచి, బ్రహ్మ

తత్వ మెరుగుచున్ బొందును ధరను నిజము,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.  

భావము.

ఎవడు అచంచలమైన భక్తియోగముతో నన్నే సేవించుచున్నాడో వాడే 

ఈ త్రిగుణములను సులభముగ నతిక్రమించి బ్రహ్మాకాశ విశ్వగర్భస్వరూపమును 

పొందుట కర్హుడగుచున్నాడు.

జైహింద్

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.