గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, అక్టోబర్ 2022, ఆదివారం

ఊర్ధ్వమూల మధఃశాఖ - ...15 - 1...//....మాంచయోవ్యభిచారేణ- , , .15 - 2,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

జైశ్రీరామ్. 

అథ పఞ్చదశోధ్యాయః - పురుషోత్తమయోగః

శ్రీభగవానువాచ|.

భావము.

శ్రీ భగవానుడన్నాడు:

|| 15-1 ||

శ్లో.  ఊర్ధ్వమూల మధఃశాఖ మశ్వత్థం ప్రాహురవ్యయమ్|

ఛన్దాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్.

తే.గీ.  మొదలు పైకి, శాఖలుక్రిందికి దలప నుండు

నందురశ్వత్థమును ఘనులరసిచూడ

నాకులే ఛందములు, దీని నరయువారు

వేదవిదులర్జునా, కాంచు ప్రీతితోడ.

భావము.

మొదలు పైకి శాఖలు క్రిందకు ఉన్న అశ్వత్థమును అవ్యయమైనదని పె

ద్దలు చెప్తారు. దాని ఆకులు ఛందస్సులు. దీనిని ఎరిగినవాడు వేదాలను 

ఎరిగినట్లే.

|| 15-2 ||

శ్లో.  అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా

గుణప్రవృద్ధా విషయప్రవాలాః|

అధశ్చ మూలాన్యనుసన్తతాని

కర్మానుబన్ధీని మనుష్యలోకే.

తే.గీ.  క్రిందికిన్ బైకి బెరుగుచు బంధనములు

భూమిపై పెంచు, నీశాఖ లేమనందు,

మాయలోముంచి మనలను మదనపరచు,

నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.  

భావము.

దానికొమ్మలు క్రిందికి పైకి విస్తరించుకొని ఉన్నాయి. గుణాలచే పెరుగుతాయి. 

విషయ వస్తువులనే చిగుళ్ళు కలవి. కర్మలలో బంధిస్తాయి. దాని వేళ్ళు క్రింద 

బాగా పాతుకొని మనుష్య లోకం అంతా వ్యాపించి కర్మలతో బంధిస్తాయి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.