గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, అక్టోబర్ 2022, శనివారం

గామావిశ్య చ భూతాని ధార - ...15 - 13...//....అహం వైశ్వానరో భూత్వా- , , .15 -14,,,//...14వ అధ్యాయము. ...పురుషోత్తమయోగము

జైశ్రీరామ్.

 || 15-13 ||

శ్లో.  గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా|

పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః.

తే.గీ.  పృథ్విలోనికి నే జొచ్చి పుడమి జీవ

కోటినే మోయుచుంటిని  మేటిగాను,

శశిగ నోషధులిచ్చుచుచక్కగాను

వృక్షవృద్ధిని చేసెడి వెన్నుడనయ.

భావము.

భూమిలోనికి ప్రవేశించి ప్రాణులందరిని నేను నా శక్తితో భరిస్తాను. ఇంకా 

రసాత్మకుడైన చంద్రుడిని అయి ఓషధులన్నింటికీ పుష్టి ని ఇస్తాను.

|| 15-14 ||

శ్లో.  అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః|

ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్.

తే.గీ.  నేను వైశ్వానరుండను, ప్రాణికోటి

నాశ్రయించి యపానప్రాణమొదల

యినటువంటివానినిగూడుచునలవిధము

లుగను నారగింతును భుక్తి జగతిలోన.

భావము.

నేను వైశ్వానరుణ్ణి అయి ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి, ప్రాణ ఆపానములతో 

కలిసి నాలుగు రకముల అన్నాన్ని ఆరగిస్తాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.