గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, అక్టోబర్ 2017, శనివారం

కృష్ణుడికి 16008 భార్యలు ఎందుకు​? .. .. .. బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రిగారి వివరణము.

జైశ్రీరామ్.
ఆయులారా!
Sree ACPSastry
కృష్ణుడికి 16008 భార్యలు ఎందుకు​? Sree ACPSastry గారి వ్యాసము.
చదివితే మనకవగాహన కలుగక మానదు.
ఇక చదువఁగలరు.
 రామాయణ  ,భారత ,భాగవతాలలోచూస్తే భూమి మీదికి భగవంతుడు వచ్చినప్పుడల్లా సూర్యుడు భూమి మీదికి వచ్చినట్లు మనం భావించాలేమో..రామయణ భారతాలు విశ్లేషించి చూస్తే ఇదే అర్ధం అవుతుంది. ఒక రకంగా ఇది scientists చెప్పే Solar origin theory of earth ని
​​ supp​o​​​rt చేస్తుందేమో.
సూర్యుడి శక్తి రోజూ తగ్గి పోతూ ఉంటుంది.constant burning వలన. Consequent గా సూర్యుని కి దూరంగా ఉన్న దక్షిణ ధృవం మీద సూర్యుని శక్తి బలహీనమయి ఆ

​ధ్రు​వం ఉత్తరం వైపు జరగుతూ ఉంటుంది​. ​
.​​ఇదే​ గీత లో కృష్ణుడు చెప్పిన .. ​ ధర్మానికి గ్లాని కలగటం అంటే .​​లేకపోతె భగవంతుడు ఒకసారి ధర్మం స్థాపించి సృ ష్టి చేసిన తరువాత ధర్మానికి గ్లాని ఎందుకు .​​దక్షిణ ​ధ్రు ​​వంలో ఉండే రాక్షసులు బలం పెరిగి ఉత్తర ​ధ్రువ వాసులయిన దేవతల మీదికి అంటే  ఉత్తర ​ధ్రు ​వాన్ని జయించటానికి దండెత్తుతారు.ఆయుధ్దానికి దేవతలకు సహాయం చేయటానికి సూర్యుడు భూమి మీదికి వస్తాడు. అది కూడా ఉత్తర ​ధ్రు ​వం సూర్యుని కి దగ్గరగా ఉండటం వలన..ఇదే పాండవులు కృష్ణుని యుద్ధం లో సాయం అడగటం అంటే..కానీ దక్షిణ ధృవం సూర్యుని కి శత్రువుకాదు కదా ..అందుకని కృష్ణుడు తనకిద్దరూ సమానమే నని యుద్ధం చేయనంటాడు.యుద్ధంలో తనకు దగ్గర గా ఉంటే చాలంటాడు అర్జునుడు.సరే రథం మాత్రం తొలుతానంటాడుకృష్ణుడు. ​సూర్యుడు ప్రతినిత్యం movement లో ఉంటాడు ​. అదే రథం తోలటం అంటే,. Is not the metaphor clear
మిగతా విషయాలు .
ఉత్తరధ్రు ​వం లో దేవతలు ఉంటారు. అన్ని దేవజాతులు ఉత్తర మే. ఇక అన్ని రాక్షస జాతులు దక్షిణం లో ఉంటారు. అవేమిటంటే ...రాక్షసులు, పిశాచాలు,పాములు, పితృదేవతలు.యముడు

​. Originate కావటం దక్షిణ ధ్రు వమైనా ,  భూమి మీద ఉండే మన మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి South pole magnetic lines కి పాము రూపం ఇచ్చారు మన ఋషులు . పాము భూమి లో నుంచి పుట్ట ద్వారా బయటకు వసుంది కదా . ​
..అందుకే. అన్నమాట. దక్షిణ​ధ్రు ​వ శక్తి అయిన తక్షకుడు ఉత్తర కొడుకయిన పరీ

​క్షిత్తునుకాటు వేస్తాడు.భారతం.మొదలు కావటం సర్పయాగం తో మొదలవుతుంది. ఇది ratio​n​alisation of south pole .కారణం తక్షకుడు పరీక్షిత్తు ని కాటువేయటం ఉత్తర ధృవానికంటే దక్షిణ ధృవం బలపడటం అన్నమాట.

 రాముడు సూర్యుడు అని వాల్మీకి ఎప్పుడూ చెబుతున్నాడు. దానికి చాలాఉదాహరణలు చెప్పచ్చు..విశ్వామిత్రుడు బల అతిబల ఇవ్వడం,రాముడు పునర్వసు నక్షత్రం లో పుట్టాడు.సూర్యుని పునర్వసు నక్షత్రం లో గాయత్రీ మంత్రం తో పునరాధా నం చేయాలనీ వేదం చెబుతున్నది. గాయత్రీ మంత్రస్థానం లో విశ్వామిత్రుడిని రప్పించాడు వాల్మీకి  .

​రాముడు ​తన గుర్తుగా ఉంగరం పంపించటం. ​ సూర్యుడికి వేదంలో హిరణ్యపాణి  అని పేరుంది అంటే చేతిలో బంగారం కలిగిన వాడు అని చేతిలో బంగారం అంటే ఉంగరమే .. అందుకే తాను సూర్యుడినని చెప్పటానికి రాముడు ఉంగరం పంపించాడు. ఇంకా  చాల గుర్తులున్నాయి రామాయణం లో ​.....
బారతం లో అగ్ని స్వరూపుడైన అర్జునుడి​కి సారథ్యం చేయటం మొదలయిన విషయాలు ..

​ఇంద్రుడు నాలుగవ ఆగ్నియని వేదం చెబుతున్నది . ఆయన కొడుకు అర్జునుడు . అర్జునుడు కూడా అగ్నియే  . అందుకే శివుడు పాశుపతం ఇచ్చాడు . అగ్నికి సారథ్యం చేయటానికి సూర్యుడికంటే  తగిన వాళ్ళు ఎవరు. ​

ఇక భాగవతం లో కృష్ణుడు ..16008 భార్యలు విషయం ...
: కృష్ణుడు సూర్యుడు అని ఒప్పుకుంటే ...కృష్ణుని పుటుక నుంచి విశ్లేషించితే..కృష్ణుడు అర్థరాత్రి పుట్టాడు.Actual గా సూర్యుని effect అంటే sunrise effect ..అర్థ రాత్రి నుంచే మొదలవుతుంది.అందుకనే  శివరాత్రి అభిషేకం అర్థ రాత్రి నుంచే మొదలవుతుంది.

​శివుడు సూర్యుడేనని రుద్రాభిషేకం లో మంత్రం లో ఉంది. 12 గంటలకు సూ ర్యోదయం​ effect ఉంటుందని మన వాళ్ళు ఊహించటం వలన వారు earth యొక్క global షేప్ ఊహించినట్టు కనపడుతుంది. మనం వై-axis పైన ఉంటె

ఎక్కడో X -axis కుడి extreme లో సూర్యోదయం అవుతూ ఉంటుంది .global shape కనుక దాని ఎఫెక్ట్ vertex మీద ఉంటుంది . అంటే సూర్యోదయం ---- , మనం ఉన్నచోటు....  right angle triangle hypotenuse  అటు పాయింట్ .. ఇటు పాయింట్ గా ఉంటామన్నమాట

ఇక" గో"అంటే సూర్యకిరణాలు అని అర్ధం ఉంది.సూర్యుడు పుట్టగానే. ఎక్కడికి వెళతాడు? సూర్యకిరణాలు ఎక్కడ ఉంటే అక్కడి కి వెళతాడు ..సూర్యకిరణాలు అంటే గోవులు ఎక్కడ ఉన్నయ్..రేపల్లె లో నందుని దగ్గరకు వెళతాడు ..ఇక అర్థ రాత్రి సూర్యోదయం తెలియని కంసుడు శతృవు లేడనుకుంటాడు​కారణం.దక్షిణ ధృవం ఎక్కడో భూమి కింద పల్లం లో ఉంటుంది .అందుకని సూర్యోదయం కనపడదు. కంసుడికి రాక్షస సహాయం ఉన్నట్టు ఆయన పూతనను, శక టాసురుడిని , పంపించటం లో అర్థమవుతుంది .  . గోకులంలో గోసంపద పెరుగుతూఉంటుంది అంటే సూర్యుని కాంతి పెరుగుతూ ఉంటుంది.ఇక గోపికలు.​..... ​చిన్నతనంనుంచి గోపికలు కృష్ణుని తోఏదో సంబంధం కలిగిఉన్నారు.గోపికల పని ఏమిటి.?
 గోవుల ని పితకటం ..అంటే సూర్యకిరణాల నుండి నీటిని పితకటం .పితికేదెవరు..చంద్రకిరణాలు.
గోపికలు అంటే చంద్రకిరణాలు.కానీ ​.... ​సూర్యకిరణాల రూపమే చంద్రకిరణాలు.​.... ​అందుకే గోపికలు కృష్ణుని వెంట పడటం ఎవరూ ఆపలేకపోయినారు.
ఇక చంద్రకిరణాల సంఖ్య ఎంత?  చంద్రుడి కి 16 కళలు.దానినే ఒక్కొక్క రోజున ఒక్కొక్క కళ ..కానీ చంద్రకిరణాలు అనేకం. వాటిని సహస్రం అన్నారు. ఎక్కువ అని చెప్పటానికి సహస్రం అనే మాట వాడటం సాంప్రదాయం ..ఈగోపికలను నరకాసురుడు బంధించాడు. నరకాసురుడు భూదేవి కొడుకు ..అంటే ఛాయ అన్నమాట..అంటే భూమి నీడపడి ...చంద్రకాంతి మరుగున పడింది.ఆగోపికలు సూర్యకిరణాల రూపం కాబట్టి ..కృష్ణుడు కలగజేసికొని వారిని విడిపించాడు
 ఈవిధంగా 16008 లో 16000 కి లెక్క తేలింది. వీళ్లందరితో రాసక్రీడ సలిపాడు కృష్ణుడు. సూర్య కిరణాలు నీటిని గ్రహిస్తయి .సూర్యడికిరణాల వేడికి సముద్రాలే ఇంకుతయ్యి..ఆఇంకిన నీటిని గ్రహించి చంద్రకిరణాలు చల్లపడతయ్యి.చల్లదనమే రసం ..ఆకిరణాలతో చేసేదే రాసక్రీడ.అందుకే రాస క్రీడ ఎప్పుడూ రాత్రిపూట వెన్నెల లో జరుగుతుంది.​సూర్యకిరణాల చల్లని రూపమే చంద్ర కిరణాలు .సూర్యుడు  సూర్యకిరణాలు  లేకపోతేచంద్ర కిరణాలు లేవు. అందుకే చంద్రుడిని ధరించి కాపాడతాడు శివుడు ​
 ఇక 8 ..ఇది అష్టవసువులు   సూర్యుని విష్ణువు గాచెబుతుంది వేదం..అందుకే కృష్ణుడు 8 వ గర్భం. కృష్ణుని వసురూపంగా చెప్పాడు వ్యాసుడు.అందుకే వాసుదేవుడు అన్నారు ఆయనను..8 సంఖ్య విష్ణువుకి ఇష్టం.అందుకే అష్టమి రోజున పుట్టాడు కృష్ణుడు. గాయత్రి కి అధిష్ఠాన దేవత విష్ణువు.గాయత్రి రూపమైన గ​రు ​క్మంతుడు ఆయన వాహనం. నరకాసురుడి తో యుధ్దానికి కృష్ణుడు గరుక్మంతుడు మీద నే వెళతాడు.అందుకని అష్టభార్యలు..
ఇంకా ఎంతయినా చెప్పవచ్చు..
కృష్ణుడంటే సూర్యుడే. ఇదే వ్యాసహృదయం.మిగతా వ్యాఖ్యానాలు ప్రయత్నించి చెప్పినవే ...Central Pillar idea strong గా ఉండదు.

: అష్ట వసువుల కు గుర్తు అయిన శమంతకమణిని సత్రాజిత్తు ​​సముద్రం ఎదురుగా తపస్సుచేసి సంపాదించాడని కథలో ఉంది
భీష్ముడు అష్టవసువులలో ఒకడు.అష్టవసువులకి సముద్రం స్థానం. అందుకే వసువులు గంగను ప్రార్థించారు.గంగ సముద్రానికే వెళుతుంది కదా
కృష్ణుడు సముద్రంలో ద్వారకలో ఉండటానికి ఇదే కార ణం​. ​ సముద్రంలో అష్టభార్యలతో కృష్ణుడు ఉంటాడు.అంటే అష్టవసువులతో నన్న మాట
​​ఇదీ 16008 మంది భార్యలంటే.
​భవదీయుడు
ACPశాస్త్రి.
పూజ్యులైన అందుకూరి శాస్త్రిగారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అద్భుతముగా వివరించిన పాండితీ స్రష్టకు పాదాభి వందనములు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.