శ్లోll
ఏకో z భూన్నలినా త్పరస్తు పులినా ద్వల్మీకత శ్చాపరః
తే సర్వే కవయస్త్రిలోక గురవ స్తేభ్యో నమస్కుర్మహేll ( ఉద్భటుఁడు )
భావముll
కమలమునను, పులినమునను, వల్మీకమునను, పుట్టినవారే అపూర్వ కవులు.
పరమాత్మ కళయై, యమృత రూపిణి యైన వాణిని చిర తపః ఫలముగా దర్శించి, ఆమె దివ్య స్వరూపమును లోకమున కెఱిగించిన వారు వారే. కావున వాణి కంటెను ఆ కవులే వందనీయులు. ఆ సరస్వతి లోకమున ప్రకాశింప తనంత తానే బ్రహ్మ నలు మొగముల నుండి నాలుగు రూపములతో వెలువడినది. ఆ కారణముగా బ్రహ్మ ప్రథమ కవి యైనాడు. అష్టాదశ పురాణములను, భారతమును మిత్ర సమ్మితములుగా వెలువరించిన వ్యాసుడును, రామాయణమును కాంతాసమ్మితముగా వెలువరించిన వాల్మీకియు పూజ్యులైనారు. ఈ మువ్వురి కారణముగ ప్రసిద్ధమై, లోకమును కాపాడే వేద సరస్వతీ మాత జ్ఞానదేవత. ఆమెకు నమస్కరించుటకు పూర్వము మూలమైనవారగు బ్రహ్మ,వ్యాస, వాల్మీకి లు పూజనీయులు.అట్టి వారికి నమస్కారము.
జైహింద్.
Print this post
దర్శనం నాటకవ్యాసాల రచయిత ఆచార్య మూల మన్నికార్జున రెడ్డి మహోదయులకు అభినందన
పంచరత్నములు.
-
జై శ్రీరామ్.
శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు.
దర్శనం నాటక వ్యాసాల రచయిత
ఆచార్య మూల మన్నికార్జున రెడ్డి మహోదయులకు
అభినందన
పంచరత్నములు.
రచన ... చ...
1 వారం క్రితం
వ్రాసినది



0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.