అజ్ఞానులు - జ్ఞానులు - - - ఇత్తడి - పుత్తడి.
శ్లోll
నిస్సారస్య పదార్థస్య ప్రాయేణాడంబరో మహాన్
న సువర్ణే ద్వనిస్తాదృక్ యాదృక్ కాస్యే ప్రజాయతే.
ఆll
సార హీనమైన సకల వస్తువులకు
డంబమెక్కువయ్య! డంబు తోచు.
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగదు.
చూడ ముచ్చటగును సుజన పథము.
భావము:-
అల్ప వస్తువులకు ఆడంబరము ఎక్కువగా ఉంటుంది. కంచు మ్రోగునట్లు కనకము మ్రోగదు కదా!
మన పూర్వీకులు అపార లోకానుభవం రంగరించి చెప్పిన శ్లోకాలు మనకు లభించిన మేలిమి బంగారాలు.
జైహింద్.
Print this post
ధర్మాచరణలో ధర్మపత్ని యొక్క ప్రాధాన్యత ..... శ్రీపద్మమహాపురాణంలో....
-
ధర్మాచరణలో ధర్మపత్ని యొక్క ప్రాధాన్యత శ్రీపద్మమహాపురాణంలో ఇలా
వివరింౘబడింది.
# పూతాం పుణ్యతమాం స్వీయాం, భార్యాం త్యక్త్వా ప్రయాతి యః|
తస్య పుణ్యఫలం...
20 గంటల క్రితం
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.