గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మార్చి 2015, శనివారం

పాఠకజనాళికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు శ్రీరామనవమి. మానవ జాతికి పరమ పవిత్రమైన రోజు ఈ రోజు. ఆ రఘుకుల తిలకుఁడైన  మన సీతామనోభిరాముఁడు మన హృదయాలలో ఆనందం వెల్లివిరయించే గొప్ప పండుగ రోజు.
ఉ. శ్రీరఘురామ చంద్రుఁడును, శీతమ తల్లియు చిన్మనోజ్ఞ సద్
భారతజాతి గౌరవము, భాగ్యవిభాతిని పెంపు జేసి, స
ద్వీర జవవానులక్షయప్రదీపిత తేజులఁ జేసి, యాంధ్రులన్
వారసులై వెలుంగునటు వర్ధిల జేతురు భారతావనిన్.
చ. సుగుణ జనాళిఁ బ్రోచు, వరశోభల వెల్గెడి సత్కవీశులన్,
నిగమసువేద్యులన్, ప్రభుల, నేర్పరులై వెలుగొందు పూజ్యులన్,
జగమున వెల్గఁజేయుదురు, చక్కగ రాముఁడు, సీతమాంబయున్.
సుగుణ సుపాఠకోత్తముల శోభిలఁ జేతురమోఘరీతులన్.
క. శ్రీరామ నవమి రోజున
రారా రఘురామ కావ రారా యన్నన్,
ధీరోదాత్తుండగు నా
శ్రీరాముఁడు మదిని నిలిచి క్షేమమునిచ్చున్.
జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.