గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మార్చి 2015, మంగళవారం

వైదిక గణిత అష్టావధానము.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! అవధానము ఆంధ్రుల సొత్తు అని మనం మురిసిపోయే విధంగా మన అవధాన భారతులు అవధాన విద్యను ప్రకాశింపజేశారు. ఈ అవధానం భాషాపరంగానే కాదు, గణితాదులలో కూడా అద్భుతంగా చేసి మన ఆంధృల కీర్తి పతాకను ప్రపంచ దేశాలలో ఎగురవేయగల సత్తా గల మన ఆంధ్రచిరంజీవులను చూస్తుంటే వళ్ళు పులకరించక మానదు.
ఈ బాల మేధావి చేస్తున్న గణితాష్టావధానం తిలకించండి. మన ఆంధ్రమాత ఒడిలో పెరిగే బిడ్డలకుండే ప్రజ్ఞాపాటవాలను గూర్చి మీకే అర్తమౌతుంది.

ఈ బాల మేధావికి శుభాభినందనలు.
తలిదండ్రుల్ మహనీయ భావగరిమన్ ధర్మాత్ములై బిడ్డలన్
కలనైనన్ విడకుండ ప్రేమ గనుచున్, కారుణ్యమున్ చూపుచున్,
విలువల్ పెంచెడి వర్తనన్ గరిపినన్ విజ్ఞాన భాండమ్ములై
భళిరా యాంధ్రుడ! నీకు సాటి కలరా? భవ్యా! యనన్, వెల్గరే? 
ఈ చిరంజీవి యొక్క తల్లిదండ్రులను మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.