గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, డిసెంబర్ 2009, మంగళవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 67.

సుజ్ఞాన సంపన్నులార!
మనము గ్రహింపఁ దగినవి ఎందుండైనను గ్రహింపఁ దగునని ఒక చక్కని శ్లోకము కలదు. దాని నిపు డరయుదము. చూడుడు.

శ్లో:-
విషాద ప్యమృతం గ్రాహ్యం, బాలాదపి సుభాషితం.
అమిత్రాదపి సద్ వృత్తం, అమేధ్యాదపి కాంచనం.

తే:-
సుధను విషము నందున్నను వెదకి, గొనుత.
బాలునుండైన గొనుత సద్ భాషణంబు.
శత్రునుండైన సద్వృత్తి చక్కఁ గొనుత.
స్వర్ణము నమేధ్యమున నున్నఁ జక్కఁ గొనుత.

భావము:-
అమృతమును విషమునందున్నట్టిదానినైనను గ్రహింప వచ్చును. మంచి మాటలను చిన్న పిల్లవాడు చెప్పుచున్నవైనను గ్రహింప వచ్చును. మంచి నడవడికను శత్రువు నుండియు గ్రహింప వచ్చును. బంగారమును అపవిత్ర స్థలమునందున్నదియైనను గ్రహింప వచ్చును.

అందుకేనేమో మృత్యువుతో పోరాడుచున్న తన శత్రువైన రావణాసురునుండి రాజనీతిని గ్రహించ వలసినదిగా లక్ష్మణుని రాముడు ఆదేశించి ఉంటాడు. అంటే మనం మంచియన్నదానినెక్కడనుండైననూ గ్రహించ వచ్చునని గ్రహించాలి.

జైహింద్.

Print this post

2 comments:

durgeswara చెప్పారు...

మంచి విషయం చెప్పారు

Apparao చెప్పారు...

మంచి మాట చెప్పారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.