గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, డిసెంబర్ 2009, సోమవారం

తేదీ.22 - 12 - 2009. ప్రపంచ గణిత దినోత్సవము

సహృదయ రంజకులారా!

శ్లో:-
యథా శిఖా మయూరాణాం - నాగానాం మణయో యథా
తద్వ ద్వేదాంగ శాస్త్రాణాం - గణితం మూర్ధని వర్తతే.

నెమళ్ళకు శిఖలు వలెను, పాములకు మణుల వలెను, వేద వేదాంగ శాస్త్రము లన్నింటికినీ శిరస్సున అంటే అగ్ర భాగమున గణితము ఉన్నది, అని వేదాంగ జ్యోతిష గ్రంథమున కలదు.

నేను గణితంద్వారానే సత్యాన్ని గ్రహిస్తాను అన్నారు శ్రీనివాస రామానుజన్
తేదీ. 22 - 12 - 2009. న " ప్రసిద్ధ భారతీయ గణిత మేథావిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన " మన యీ శ్రీనివాసరామానుజన్ జన్మ దినోత్సవము.

దీనిని ప్రపంచ గణిత దినోత్సవముగా జరుపు కొను చున్న సందర్భముగా గణిత విద్యా పారంగతులకు, గణిత శాస్త్రాభిమానులకు శుభాకాంక్షలు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.