జైశ్రీరామ్.
శ్లో. యచ్ఛ్రుతం న విరాగాయ, న ధర్మాయ, న శాంతయేసుశబ్దమపి శబ్దేన కాకవాశితమేవ తత్.
గీ. విన్న శబ్దాన జ్ఞానంబు పెరుగ వలయు.
విన్న శబ్దాన ధర్మంబు పెరుగ వలయు.
విన్న శబ్దాన శాంతియు పెరుగ వలయు.
అట్టి శబ్దంబు కానిది వట్టి గోల.
భావము. విన్నదేదో వైరాగ్యాన్ని కలిగించకపోతే, ధర్మాచరణకు ప్రోత్సహించకపోతే, శాంతిదాయిని కాకుంటే – అది ఎంత గొప్ప సుశబ్ద మైనా , కేవలం కాకి అరుపుగానే భావించాలి.
జైహింద్.

వ్రాసినది






