గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జూన్ 2014, మంగళవారం

వేపథుర్మలినం వక్త్రం ,...మేలిమి బంగారం మన సంస్కృతి, 227..

జైశ్రీరామ్.
శ్లో. వేపథుర్మలినం వక్త్రం , దీనా వాగ్గద్గః స్వరః
మరణే యాని చిహ్నాని , తాని చిహ్నాని యాచకే.
క. యాచన మృత్యు సమానము. 
యాచించెడు వాని మలినమావనంబౌన్
యాచకు పలుకులు వణకును.
యాచకుఁడును మృతుని పోలు యాచన వేళన్.!

భావము. వణకుతో ముఖం మలినమైపోతుంది , దీన భావంతో వాక్కు గద్గదమౌతుంది. మరణసమయంలో ఏ చిహ్నాలు వస్తాయో అవన్నీ యాచకునిలో కనిపిస్తాయి. (యాచన - మరణంతో సమానం)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్జారములు
ఒకరిని చెయి జాపి యాచించడం అన్నది చాలా దుర్భర మైన పరిస్థితి. అంధుకే వెనకటి రోజుల్లోమరీ తప్పని పరిస్థ్తితిలో " ణా మీసం తాకట్టు పెట్టాను అనేవారట " రోషానికి ప్రతీకగా . మంచి వి షయం చెప్పారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.