గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జూన్ 2014, గురువారం

న ద్విషంతి , న యాచంతే...మేలిమి బంగారం మన సంస్కృతి, 229.

జైశ్రీరామ్.
శ్లో. న ద్విషంతి , న యాచంతే , పరనిందాం న కుర్వతే 
అనాహూత న చాయాంతి , తేనాశ్మనో పి దేవతాః! 
గీ. ద్వేషమెఱుగదు, యాచనతెలియదెపుడు, 
పరులనిందింప నేరదు. పరులకడకు 
పిలువ కుండగ వెళ్ళదు. వీటి వలన 
దైవమైనది రాయియు. తలపరేల?
భావము. ఎవరినీ ద్వేషించటంలేదు, ఎవరినీ యాచించటంలేదు, పరనింద చేయటంలేదు, పిలువని చోటికి వెళ్ళటంలేదు - ఈ కారణాలవల్ల శిలలుకూడా దేవతలౌతున్నాయి !
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఏవరి జోలికీ వెళ్ళ కొండా దేని గురించి పట్టించు కోకుండా మౌన ముద్ర వహించి శిలగా మారితే అదే దైవత్వం చాలా బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.