గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జనవరి 2019, శనివారం

నూతన ఛందములలో గర్భ కవిత 110. . . . రచన . . . శ్రీ వల్లభ

గర్భస్త వృత్తములు----విభూతినీ.శ్రీవరామ.తరంగ.రయోత్సుక.దుష్ప్రభా
రాజనీతి.సుస్వార్ధ.పరచింతన. మారణహోమ.వృత్తములు. 
                         విధి నటనా వృత్తము.

రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
యుగములసింహావలోకన.
-------------------------------------
ధర్మమునకుగ్లాని యేర్పడినపుడుశ్రీమహావిష్ణువు ధర్మసంస్థాపనార్ధమై
యవతారములెత్తుచుండును.నాల్గుయుగములందు  కృతయుగము
ధర్మప్రపూర్ణమైనిల్చెను .త్రేతాయుగమునందు సత్యముమూడుపాదాల
నడచెను.ద్వాపరమునధర్మమురెండుపాదములకుదిగెను.శివునివెన్నాడు
బ్రహ్మహత్యాపాతకనివారణకుగాను విష్ణువు18అక్షౌహినీలబలగమును
కురుక్షేత్రమందిడుటకు నొడంబడిక కుదుర్చుకొనెను.తత్కారణమున
కృష్ణావతారముయెత్తవలసివచ్చెను.అందులకుగానుఅక్రమసంతానమునకు
తెరదీయవలసి వచ్చెను.కుండలు గోళకులవృద్ధి వారిప్రధాన్యతపెచ్చెను.అధర్మము
తో ధర్మమునిలబెట్టుటకుప్రయత్నములుకొనసాగెను.మాయలు కుతంత్రములు
కుయుక్తులనిలయమాయెను.భారతమును పంచమవేదముగాపరిగణింపబడెను
ఆనాటి సాంఘిక రాజకీయ వ్యవహారపరిస్థితులకనుకూలముగాజగనన్నాటకధారి
కృష్ణపరమాత్మయాడిన నాటకమే భారతముధధర్మసంస్తాపనకు భక్తయేమూలమను
ప్రబోధ గావింపబడెను. మాయలకునెలవుగాబీజోత్పత్తి జరిగెనుకారణముబలగము
యుద్ధమునకుసమర్పించుటకే.కారణమే కరణమాయెను.ప్రస్తుత కలియుగముననొంటి
పాదమునకు చేరికొనెను.యుగయుగమునకుధర్మముదిగుభాగహారమాయెను.ఒంటి
పాదమునపట్టినధర్మమున్యాయమునకుమూడింతల లన్యాయమునొప్పప్పెను.
చరిత్ర పునరావృతము కాకతప్పదనునట్లు కుల జాత్ మతఘర్షణమృగాళ్ళ
పైసాచికృత్యములుమితిమీరుచున్నవి.నేరానికితగిన శిక్షలుకరువాయెను.
ధర్మఛాయామాత్త్రముగనిల్చెను. నాగరికత పేరుతోయనాగరికులనుమించిన నైజము
బొడజూపుచున్నది.సంస్కారమామట్టిగలసెను ధర్మము కలబాధలకు తట్టుకొనలేక
పరుగులు తీయుచుండెను. భూగర్భనిక్షిప్తాలను మనుగడకుముప్పు వాటిలునటుల
అక్రమార్కులకబంద హస్తలలాగబడుచున్నవి.ఇంత అన్యాయ అక్రమాలకుతాళజాలక
ప్రకృతి ప్రకోపానికిగురి కావలసివచ్చుచున్నది.ధర్మము పూర్తిగా నశించుచివరి
ఘడియలలో ధర్మము పూర్తిగాపెరిగి కృతయుగమునకుచేర్చును.ఇదిముమ్మాటికి
నిజముపైవిషయదృష్టినందిడుకొని. ద్వాపరయుగమున విధినటనా వృత్తము
గైకొని   విభూతినీ.శ్రీవరామ.తరంగ.రయోత్సక.దుప్రభా.రాజనీతి.సుస్వార్ధ.
పరచింతన.మారణహోమ.గోళక ప్రభా.వృత్తములు గర్భస్తముగావింపబడినవి.
           విధినటనావృత్తము.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
యుగలక్షణములను చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు . మాకందించిన శ్రీ చింతా సోదరులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.