గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, నవంబర్ 2018, సోమవారం

రేపు క్షీరాబ్ధి ద్వాదశి. - వివరణ. బ్రహ్మశ్రీ నారాయణ భట్ల చైతన్య.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
పరమపవిత్రమైన క్షీరాబ్ధిద్వాదశి రేపే. దీనిని గూర్చి బ్రహ్మశ్రె నారాయణభట్ల చైతన్య ఎలా వివరించారో చూడండి..
క్షీరాబ్ధిద్వాదశి
శ్లో.ఉపరాగ సహస్రాణి!
వ్యతీపాతాయుతానిచ!
అమాలక్షంతు ద్వాదశ్యాః!
కలాంనార్హంతిషోడశీమ్!!
తా.వేయి గ్రహణములును, పదివేల వ్యతీపాతయొగములును,లక్షఅమావాస్యలును కలిపిన క్షీరాబ్ధిద్వాదశి వ్రతఫలానికి పదహారో వంతుకు కూడా సరిసమానము గాజాలదు.
పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి. ఇలా అనేక నామాలతో అనంత కోటి పుణ్యఫల ప్రదాయినిగ ప్రసిద్ధిగాంచిన ఈ క్షీరాబ్దిద్వాదశి మహాపర్వదినమున విద్యుక్తముగ చేయవలసిన స్నానము,దానము,అర్చన.
శ్రీతులసి,ధాత్రి సమేత శ్రీలక్ష్మీనారాయణస్వామిని, శ్రీకార్తీకదామోదరుని, శ్రీభవానీశంకరులను పూజించుట.తదనంతరం..దానము
వాటిలో ముఖ్యమైనవి.
1.సాలగ్రామ,2వస్త్ర,3యజ్ఞోపవీత,4.ఛత్ర,5.వ్యజన,6పాదుక,7.ఉదకుంభ,8.రజితప్రతిమ,9.నవరత్న,10.సుగంధద్రవ్య,11.చందన,12.ఆమలక,13.పూర్ణఫల,14.దధ్యోదన 15.దీపదానములను 16.రజితదీప దానములను
యథాశక్తిమేరకు నిర్వహించవలెను
-:ఈ క్షీరాబ్ధి ద్వాదశినాడు ఆచరించవలసిన దానములు ఆచరించిన వచ్చే అపూర్వపుణ్యఫలా లనుగూర్చి స్కాందపురాణంలో ఉన్న విశేషాంశాలు:-
శ్లో.సాలగ్రామం సమభ్యర్చ్య శ్రోత్రియాయకుటింబినే!
దానంయఃకురుతేభక్త్యా!తస్యపుణ్యఫలంశ్రుణు.
శ్లో.చతుస్సాగరపర్యంతం!
భూదానాద్యత్ఫలంవిదుః!
తత్ఫలంసమవాప్నోతి!
ద్వాదశ్యాంకార్తికస్యచ!!
తా.క్షీరాబ్ధిద్వాదశినాడు సాలగ్రామాన్ని చక్కగపూజించి అద్దానిని శ్రోత్రియుడైన బ్రాహ్మణగృహస్థుకి దానం చేసినట్లైతే నాలుగు సముద్రముల మధ్యనున్న యావత్తు ఈ భూమండలాన్ని మొత్తాన్ని దానం ఇచ్చినంత పుణ్యఫలం వొస్తుంది.
శ్లో.ద్వాదశ్యాంకార్తికేమాసి!
వస్త్రదానంకరోతియః!భక్త్యాప్రయత్నతోరాజన్!
పాపైఃపూర్వార్జితైరపి!
విముచ్యవిష్ణుభవనం!
యాతినాస్త్యత్రసంశయః!!
తా.క్షీరాబ్ధిద్వాదశినాడు భక్తితో శ్రోత్రియుడైన బ్రాహ్మణగృహస్థుకి వస్త్రదానం ఆచరించువాని పూర్వజన్మార్జిత పాపములు నశించి. తుదకు వైకుంఠం జేరును. ఇందు సందేహము లేదు.
శ్లో.ఫలం, యజ్ఞోపవీతంచ!
సతాంబూలం సురక్షితం!
ద్వాదశ్యాంయే ప్రకుర్వంతి!తత్ఫలం శృణుభూమిప!!
శ్లో.భుంక్తే స విపులాన్ భోగాన్!
స్వర్గేప్యంతేతుదుర్లభాన్!
పశ్చాద్విష్ణుపురం ప్రాప్య!
మోదతే విష్ణువచ్చిరమ్!!
తా.క్షీరాబ్ధిద్వాదశినాడు భక్తితో శ్రోత్రియుడైన బ్రాహ్మణగృహస్థుకి ఫలమును,-యజ్ఞోపవీతమును,-తాంబూలమును, ఇచ్చువాడు. యీలోకమందు ఆనేకభోగములను పొంది. అంతమందు విష్ణులోకమున చిరకాలము సుఖించును.
శ్లో.కార్తికేమాసిద్వాదశ్యాం!
దధ్యన్నందానముత్తమం!
యఃకుర్యాత్సోపి ధర్మేభ్యో!
అధికంఫలముచ్యతే!!
తా.క్షీరాబ్ధిద్వాదశినాడు భక్తితో శ్రోత్రియుడైన బ్రాహ్మణ గృహస్థుకి పెరుగు అన్నమును దానము చేసిన యెడల సమస్తధర్మములకంటే అధికఫలమును పొందును.
*"*ముఖ్యగమనిక*"*
*"ప్రదానం ప్రఛ్ఛన్నం*" అంటే?
తాను ఇతరులకి ఇచ్చినదేదీ చెప్పరాదంటున్నది శాస్త్రం. అలా కాదని దానంగ, కాని ధర్మముగ, గాని తాను ఇతురులకి ఇచ్చినవి. ఎంతమందికి చెబితాడో ఎంతమంది విని సంతోషించారో? అంతమందికి తాను చేసిన దానమో ధర్మమమో ద్వారా వొచ్చిన పుణ్యఫలంలో నాల్గోవొంతు వారంతా పొందినవారవుతరని శాస్త్రనిర్దేశం. అయినప్పటికి. ఆ జగదంబ కృపతో నేనిచ్చిన కొద్దిపాటి దానవిశేషాలన్నిటిని మీ అందరికి తెల్పటంలోని ఆంతర్యం. నాకు ఏ విషయం గూర్చైన సరే సవివరణగ సోదాహరణలతో చెప్పడం అలవాటు. మరి అత్యంత పవిత్రతరమైన క్షీరాబ్ధిద్వాదశినాడు ఆచరించవలసిన దాన ధర్మాలగూర్చి సోదాహరణగ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎవరు యథోక్తముగ కాకపోయిన కనీసం యథాశక్తిమేరకైన దాన,ధర్మాలు విధిని అనుసరించి ఆయా పర్వదినాలలో ఏమేమి చేయాలో తెల్సుకొని ఆచరించేవారు తారసిల్లకపోవటంతో. నాకొచ్చే పుణ్యఫలం తగ్గుతందని తెలిసి ఉండికూడా కేవలం మన మహర్షులచే ఆర్షగ్రంధాలలో నిర్దేశింపబడిన పర్వములను పండగల పేరుతో విందు,వినోదాలకో విలాసాలకో మాత్రమేకాదు. ముక్తికొరకై ఇలా స్నాన,దాన,పూజా కార్యక్రమాలని ఆచరిస్తున్నవారు ఇంకా ఉన్నారని. (ఏనుగులు నడిచిన దోవలో ఎర్రచీమలైన నడుస్తున్నాయనే) భావన ప్రఢవిల్లాలనే సదుద్దేశ్యంతో మాత్రమే పై విషయాలన్నిటిని ప్రస్తావించానే కాని నా స్వోత్కర్షకు మాత్రంకాదని సహృదయులైన మీ అందరికీ సవినయముగ మనవి చేయుచున్నాను.
స్వస్తి.
నారాయణభట్ల చైతన్య.
చైతన్యగారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
క్షీరాబ్ధి ద్వాదశి గురించి అద్భుతమైన విషయాలను వివరించి నందులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.