గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఫిబ్రవరి 2018, శనివారం

శ్రీవల్లభకు అభినందనమందారం M.s.s.n.మూర్తి.

జైశ్రీరామ్. 
భాషాప్రవీణ.
M.s.s.n.మూర్తి.
ఎంఏ.తెలుగు.ఎంఏ.సంస్కృతము.
శ్రీకాకుళం.
                 అభినందనమందారం
ఛందోబంధువూ, కవితా సింధువూ - - - - - - -
సాహితీవల్లభులు,ఒజ్జల మిన్న,ఛంద స్సింహం 
(శ్రీ వల్లభ వఝల అప్పల
నరసింహ మూర్తి గారు స్వచ్ఛందంగా విరచించిన ఛందశ్శాస్త్ర శిఖరాయమాణ
గ్రంధ రాజం "శ్రీవల్లభేయ ఛందోమధనమం"-అత్యంతప్రసశంస నీయంగా ఉంది. వారికి భక్తి పూర్వక నమోవాకములు.
     శ్లో:--"శిక్షా, వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తధా
             కల్పశ్చేతి  షడంగాని వేద స్యాహు ర్మనీషిణః"-
అని ఆరు వేదాంగాలు చెప్పబడ్డాయి. వాటిలోఛందశ్శాస్స్త్రం కూడ మూడవదిగా ఉంది. ఇది కూడ ఒక ప్రభావమైన వేదాంగం అన్నమాట.
అది ఓ మహా సముద్రం అని భావిస్తే, దాన్ని మధించిన ఈ మూర్తి మహాశయులు, మంధర పర్వత మన్న మాట.
          అలా ఛందశ్శాస్త్రముమీద విస్తారమైన పరిశోధన ఎన్నోసంవత్సరాలపాటు చేసి,విశిష్టమైన ఈ కృతిని వెలయించిన వేదవేత్త
శ్రీ మూర్తిగారు. ఛందశ్శాస్త్రానికే ఎనలేని మేలు చేశారు. ఈ రచనతో పోలిస్తే
మనసంస్కృతాంధ్రపూర్వఛందః కర్తలు చెప్పిన,ఆయా ఛందస్సులు,వాటికి
సంబంధించిన వివిధ వృత్తాలు చాలా పరిమిత మైనవి.వాటితోనే మపద్య
సారస్వతం, ఎంతెంతో విరివియై విపులమై విలసిల్లి,ఆయా మహాకవీంద్రుల
చేతుల్లో దివ్యాతి దివ్యమైన వైభవంతో ప్రాభవంతో,వెయ్యేళ్ళుపైబడి పరిఢ
విల్లింది. అలాంటిది, నేటియీ ఛాందస ప్రవణైక మతి  శ్రీ మూర్తిగారి బృహత్కృషితో, ప్రభవించిన ఈకృతితో,ఛందస్సు విశ్వరూపం,విరాడ్రూపం
ధరించి,అవధులూ,పరిధులూ లేనిదై,అసంఖ్యాకం,అమేయం అయింది.
లెక్కకుమిక్కిలిగా,ఆయాఛందస్సుల్లో,నేటికవులూ,అవధానులూ,పద్య
రచన,విశిష్టంగా,సాగించవచ్చు.. మరెన్నో మహాద్భుతాలు,సాధింపవచ్చు. మ
సారస్వతవికాశసం నవ్యాతి నవ్యమై,ఈఛందఃకృతషి,రచనతో మరింతగా
కొనసాగుతుందని,శ్రీ మూర్తిగారి నిరుపమ కృతి.ఈ పుస్తకం రూపంలో
అవశ్యం జైవాతృక మవుతుందని,మనమందరం ఆశిద్దాం.నిజానికి శాస్త్ర విషయికమైన యింత అవిరామమైనకృషికీ,సాధనకూ! శ్రీమూర్తి మహోదయులకు,ఓ డాక్టరేట్ఇవ్వవచ్చు అనిపిస్తోంది.ఇది పరిశోధనేకదా! కవిత అందాలు చక్కగా ఎరిగిన శ్రీమూర్తిగారు ఆయానూతనఛందంలో విశేషాలకూ,ఆయావృత్తాలకూ కూడ చాల అందమైన అత్యంత సమంజసమైన పేర్లు కూడా పెట్టారు.ఇది అభినంద నీయం. నామకరణం చేసిన కృతిజనకుడికి ప్రణామకరణం మాత్రమే మనం చెయ్య గలిగేది!
               ఏడుపదులల ప్రాయందాటిన శ్రీమూర్తిగారి కృషికి సారస్వతలోకం
యావత్తూ అయిదు పదులు సమర్పించి వినయ వినమితం అవుతుంది. 
               ఈకృతి రచనతో పరమసుకృతియైన వేదమూర్తి శ్రీమూర్తిగారు
మరిన్ని గొప్ప గొప్ప గ్రంధ రత్నాలు, తమచేతులమీద ,ఇంకా ఇంకా
వెలయించాలని, వారి వెలలేని కృషికి నేటి సమాజం ఎంతో తోడ్పాటును
అందివ్వాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ,వృత్తరత్నాకరానికి నేటికి
ఓ మహాద్భుతమైన "మందారం " సమకూరిందని మనసారా!
ఆనందిస్తున్నాను. 
సెలవు.
         భవదీయుడు
                                             M.s.s.n.murty.
                                 విశ్రాంత అధ్యాపకుడు.
                                          శ్రీకాకుళము.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.