గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఫిబ్రవరి 2026, ఆదివారం

తుని తపోవన తేజమయిన శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీస్వామివారు కైవల్యమందినారు.

ఓం నమో నారాయణాయ.

మహాత్ములుబ్రాహ్మీభూతులు తపోవన భరతీస్వామి

ప్రతీరోజూ నేను పంపెడి పద్యములు చూచి నన్ను ప్రోత్సహించుచు దీవించెడివారు. అట్టి మహత్తరమూర్తి

తే. 13 - 02 - 2026 న బ్రహ్మలీనురయారన్న వార్త చాలా మనోవేదనను కలిగించింది.

వీరుస్థితప్రజ్ఞులు అనుటకు వీరి యీ తిరుగులేని ప్రయాణమే నిదర్శనము. శివరాత్రి పర్వదిఅమును తీసుకొని వచ్చెడి పరమ పవిత్ర ఏకాదశీ దినమున గతించుటయే నిదర్శనము.

వీరి ఆత్మపరమశివునిలో ఐక్యమై పరమానందస్వరూపులై మన మనసులలో నిత్యమూ ఉండుదురు.

ఓం నమశ్శివాయ.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.