గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, డిసెంబర్ 2021, శుక్రవారం

ఆచార్యాః పితరః పుత్రా.. ||1-34||..//..ఏతాన్న హన్తుమిచ్ఛామి.. ||1-35||..//అర్జున విషాద యోగము.

 

జైశ్రీరామ్.

శ్లో.  ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ పితామహాః |

మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సమ్బన్ధినస్తథా ||1-34||

తే.గీ.  తండ్రులున్, మేన మామలు, తాతలు మరి

మామలున్,సుతులును,భావ మరుదులు వర

లుదురు వియ్యంకు లాచార్యులు మనుమలును

నిలిచి రిద్ధాత్రి నిచ్చట న్నీవు కనుమ.

భావము. 

ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ

మామలూమనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ 

మొదలైన వారు.

శ్లో.  ఏతాన్న హన్తుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన |

అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||1-35||

తే.గీ.  కనుమ మధుసూదనా! నీవు కరుణ వీడి

నన్నుఁ జంపినన్ గాని నే నెన్నటికిని

కల త్రిలోకాధిపత్యంబు కలుగవచ్చు

చంపగాబోను, భూమికై చంపఁగలన?

భావము.

మధుసూదనానేను చంపబడినప్పటికీత్రిలోక అధిపత్యానికైనా 

వీరిని  చంపడానికి ఇష్టపడనుఇక భూలోక రాజ్యం కోసం 

చంపుదునా.

జైహింద్

                                                                                                                                

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.