గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, డిసెంబర్ 2021, బుధవారం

కాశ్యశ్చ పరమేష్వాసః ||1-17|| // ద్రుపదో ద్రౌపదేయాశ్చ ||1-18|| //అర్జున విషాద యోగము.

 జైశ్రీరామ్ .  

శ్లో. కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః |

ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||1-17||

ఆ.వే.  మహిత రథి శిఖండి,మరియు  దృష్టద్యుమ్ను

డునపరాజితుడతడుకనగనట 

సాత్యకియు విరాట్టుసధనుకాశీరాజు

శంఖనాదమచటసలిపిరపుడు.    

భావము.  

ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, 

విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ శంఖనాదము చేసిరి.

శ్లో.  ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |

సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18||

ఆ.వె.  తవిలి ద్ఉపదరాజు ద్రౌపదీ సుతులును,

వరసుభద్ర సుఁతుడు వరలిరచట,

రాజులందరచట ప్రారణమ్భ సూఇగా

శంఖ నాదములను సలిపినారు.

భావము. 

ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన 

అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు.

జైహింద్.  

                                                                                                                             


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.