గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, డిసెంబర్ 2021, శనివారం

ఏవముక్తో హృషీకేశో.. ||1-24||..//..భీష్మద్రోణప్రముఖతః .. ||1-25||..// అర్జున విషాదయోగము.

 జైశ్రీరామ్.

సఞ్జయ ఉవాచ |

శ్లో.  ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |

సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ||1-24||

తే.గీ.  భారతా వినుమనుచును పలికె సంజ

యుండు, విని కృష్ణుఁడా యర్జునుం డనిన ప

లుకులను, రథంబు నిలిపెను ప్రకటితముగ

నుభయసైన్యంబు మధ్యన నొప్పిదముగ. 

భావము. 

సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల 

మధ్య ఉత్తమమైన  రధాన్ని నిలబెట్టి,

శ్లో.  భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |

ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి ||1-25||

తే.గీ.  ద్రోణ భీష్మాది ప్రముఖుల తోడ నిచట

ఘనుల కనుమంచు సారథి కవ్వడికనె

కౌరవుల సైన్యబలమును కనులఁ గాంచ

వ్యూహమునెఱింగి సాగుచు పోవ నెంచి.

భావము. 

భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ 

కౌరవులను చూడు అన్నాడు. 

జైహింద్.                                                                                                                                                                                                                                                

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.