గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2020, గురువారం

తెలుఁగు వర్ణమాల ప్రాశస్త్యం దేవతాస్వరూపాలు.వాగ్దేవతలు.

 జైశ్రీరామ్
తెలుఁగు వర్ణమాల ప్రాశస్త్యం దేవతాస్వరూపాలు.
వాగ్దేవతలు.

తెలుఁగు భాషలో  వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణము :
అ నుండి అః.వరకు ఉన్న16 అక్షరాల విభాగాన్ని చంద్ర ఖండము అందురు.
ఈ చంద్రఖండములోని అచ్చులైన 16 వర్ణాలకు  అధిదేవత వశిని అంటే వశపరచుకొనే శక్తి కలది అని అర్ధము.

క నుండి భ వరకు ఉన్న24 అక్షరాల విభాగాన్ని  సౌర ఖండము  అంటారు.
మ నుండి  క్ష వరకు ఉన్న10 వర్ణాల విభాగాన్ని  అగ్ని ఖండము అంటారు.
ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.

సౌర ఖండంలోని క నుండి  ఙ వరకు  గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి.
అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధము.
చ నుండి  ఞ వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత మోదిని అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.
ట నుండి ణ వరకు గల ఐదు అక్షరాల  అధిదేవతా శక్తి విమల అంటే మలినాలను తొలగించే దేవత.
త నుండి న వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత అరుణ  కరుణను మేలుకొలిపేదే అరుణ.
ప నుండి మ వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత జయని జయమును కలుగ చేయునది.
అదే విధముగా అగ్ని ఖండములోని య, ర,ల, వ అనే అక్షరాలకు అధిష్టాన దేవత సర్వేశ్వరి. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.
ఆఖరులోని ఐదు అక్షరాలైన శ, ష, స, హ, క్ష లకు అధిదేవత కౌలిని.
ఈ అధిదేవతలనందరినీ వాగ్దేవతలు అంటారు.

అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం, ఒక దేవతాశక్తి ఉంది.ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.అంటే బ్రహ్మమే శబ్దము. ఆ బ్రహ్మమే నాదము.

మనం నిత్యజీవితములో  సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.
అదే మంత్రాలు, వేదం అయితే ఇంకా లోతుగా ప్రభావం చూపుతుంది భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా, వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.

మనం చదివే స్తోత్రం ఎక్కడో వున్న దేవుడిని/దేవతను  ఉద్దేశించి కాదు,
మనం చదివే స్తోత్రమే ఆ దేవత.మనం చేసే శబ్దమే ఆ దేవత
మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.
ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత. ఎంత అద్భుతము ఇది సనాతన ధర్మం.ఇది మనకు మాత్రమే పరిమితమైన
అపూర్వ సిద్ధాంతము.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తెలుగు వర్ణమాలా ప్రాశస్త్యం గురించి తెలియని విషయాలను చక్కగా వివరించారు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.