గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, అక్టోబర్ 2012, శుక్రవారం

ఖడ్గం దూసిన బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవి.

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ బంధువులారా!  యత్నే కృతే యది నసిధ్యతి కోz త్ర దోషః అన్న నానుడి ననుసరించి మన సాహితీ మిత్రులు, ప్రముఖ జ్యోతిశ్శాస్త్రవేత్త బ్రహ్మశ్రీ వల్లభవఝల నరసింహ మూర్తి కవి ఒక ఖడ్గ బంధాన్ని కవితలో బంధించి మనము కూడా ఆ ప్రక్రియ చూచే భాగ్యం కలిగిస్తూ మనముందుంచారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు డా.దేవగుప్తాపు గణపతిరావుగారి బంధ కవితలను ఆంధ్రామృతంలో చూచి, స్పందించిన హృదయంతో తానూ బంధించారు తన కవితను ఖడ్గ బంధంగా. మరి మీరూ పరిశీలించండి. అవకాశం కల్పించుకొని మీరూ వ్రాసే ప్రయత్నం చెయ్యండి.
"దృష్టం కిమపి లోకేzస్మిన్ ననిర్దోషో న నిర్గుణః."   కాబట్టి
"యత్ సారభూతం తదుపాసితవ్యం హంసో యథా క్షీరమివాంబు మిశ్రం" 
శుభమస్తు.
జైహింద్.

Print this post

1 comments:

అజ్ఞాత చెప్పారు...

Good post! This is the kind of information that should be distributed on the online community. I would like to read more of this.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.