గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, సెప్టెంబర్ 2024, సోమవారం

సీమంతినీషు కా శాంతా? చెప్పుకోండి చూద్దాం. (ప్రహేళిక)

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  సీమంతినీషు కా శాంతా ?  (సీతా)

రాజా కోఽభూత్ గుణోత్తమః ?  (రామః)

విద్వద్ధిః కా సదా వంద్యా ?   (విద్యా)

తత్రైవోక్తం న బుధ్యతే ||

భావము.  ముత్తైదువలలో శాంతస్వభావం కలవారు ఎవరు? 

గుణశ్రేష్ఠుడైన రాజు ఎవరు అయివున్నారు?

విద్వాంసులు ఎల్లపుడూ ఎవరిని వందించాలి?

దీనికి ఉత్తరం ఇక్కడే చెప్పబడింది.

ఆ.వె.  సీతఁ బోలునట్టి సీమంతి నే ను? (సీత)

రాము సాటి రాజు రహిఁ దెలుపు(రామ)

విదుషుఁ డేమి కలిగి వెలుగొందెడును సద్య   (విద్య)

శమును గాంచ? నుత్తరము లిచటనె.

భావము.  ముత్తైదువలలో శాంతస్వభావం కలవారు ఎవరు? 

గుణశ్రేష్ఠుడైన రాజు ఎవరు అయివున్నారు?

విద్వాంసుఁడు మంచి కీర్తి కనుటకు ఏమి కలిగియుండును?

ప్రతీ ప్రశ్నకు ఆయా పాదములోగల ఆద్యంతాక్షరములే సమాధానము.

వివరణ.  సీతను బోలు సీమంతిని సీతయే తప్ప మరొకరు లేనందున 

సమాధానము - సీత.

రాముని పోలునట్టి గుణశ్రేష్ఠుడైన రాజు రాముఁడే తప్ప మరెవ్వరూ లేనందున

సమాధానము - రామ.

విద్వాంసుఁడు మంచి కీర్తి కనుటకు ఏమి కలిగియుండుననగా

సమాధానము - విద్య.

జైహింద్.

నాఽనృషి: కురుతే కావ్యం. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  నానృషి: కురుతే కావ్యం, నా గంధర్వః సురూపభ్రుత్

నా దేవాంశో దదాత్యన్నం నా విష్ణు: పృథివీ పతి:.

తే.గీ.  ఋషియె కాకున్న కావ్యము నసదృశముగ

వ్రాయలే డగంధర్వుఁడువరలడంద

ముగ, భగవదంశలేకున్నభుక్తినిడడు.

లేక విష్ణ్వంశ రాజు కాలేడు ధరణి. 

భావము. ఋషి కాకున్నచో కావ్యర్చన చేయ లేడు.  దేవతాంశ లేకున్నవడు 

ఆకర్షణీయమైన రూపముతో నొప్పలేడు.  దైవాంశ లేనివాడు ఎవరికీ అన్నము  

పెట్టఁజాలడు. విష్ణ్వంశ లేనివాడు రాజు కాలేడు.

జైహింద్.

13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

ఆచార్య బేతవోలుకు విశ్వనాథ సత్యనారాయణ సాహితీ పురస్కారం

0 comments

 జైశ్రీరామ్.

కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మంకు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహితీ పురస్కారాన్ని అజో విభో కందాళం ఫౌండేషన్,సంస్కృతి వారు ప్రకటించారు. తెలుగు సాహిత్యానికి అనుపమాన సేవ చేసిన వ్యాఖ్యాతుగౌరీ శంకర శిఖరం ఆచార్య బేతవోలునుసంగీత సాహిత్య నృత్య నాటక సంస్థ
సంస్కృతి గుంటూరు వారు సగౌరవంగా సత్కరించుకుంటోంది. ఇందుకోసం సెప్టెంబరు.
15 ఆదివారం సాయంత్రం 6, 30గంటలకుగుంటూరు లక్ష్మీపురంలో శ్రీ త్యాగరాజసాంస్కృతిక సంఘం వేదిక కానుంది. ఈపురస్కార ప్రదానోత్సవానికి ప్రముఖ నాటకరచయిత, విమర్శకులు శ్రీ పిన్నమనేనిమృత్యంజయరావు అధ్యక్షత వహిస్తారు. అజోవిభో కందాళం ఫౌండేషన్ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ముఖ్య అతిధిగాపాల్గొంటారు. మహర్షి బాదరాయణ్ వ్యాససమ్మాన్ రాష్ట్రపతి పురస్కృతులు డా అడ్డంకి:శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాతి,సారస్వత కళానిధి డా వెలువోలు నాగరాజ్య లక్ష్మి ప్రసంగిస్తారు. రంగస్థల రచయిత, దర్శకులు, నటులు శ్రీ వైఎస్ కృష్ణశ్వర రావు జ్యోతిప్రకాశనం చేస్తారు. ఆచార్య బేతవోలు 1948, జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల లో అతి సామాన్య కుటుంబంలో జన్మించారు. కొవ్వూరు సంస్కృ త కళాశాలలో భాషా ప్రవీణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు పూర్తిచేశారు. నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణ లో 'తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం' అంశంపై పిహెచ్.డి చేసారు. సంస్కృతాంధ్ర లలో విశేష పాండి త్యం గడించారు. ధారణకు, ఆశువుకు పరీక్ష అయిన అవధాన విద్యలో ఆరితేరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంబొమ్మూరు సాహిత్య పీఠాధిపతిగా, హైద రాబాద్ కేంద్రీయ కేంద్రీయ విశ్వవిద్యాల యంలో ఆచార్యులుగా పనిచేసారు. సంస్కృతం నుంచి నాటకాలను ఈయన ఆను వాదం చేసారు. వ్యాఖ్యానం సమకూర్చారు. కొత్త గోదావరి వంటి పద్య కావ్యాలే కాకుండా నాటకాలూ రాసారు. దేవీ భాగన తం' వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. సాహిత్య విమర్శకులు, ఆధునికులు అర్ధం చేసుకునేలా ప్రాచీన కావ్యాలను వ్యాఖ్యానించారు.
ఆచార్య బేతవోలు 23 సంపుటాల వర్ణన రత్నాకరము వ్యాఖ్యానం వెలువరించారు. పద్యకవిత్వం, నాటకం, శతకం, అనువాదం ఆధ్యాత్మికం, అవధానం, వ్యాఖ్యానం వంటి ప్రక్రియల్లో ఆచార్య బేతవోలు కృషి విస్తరించింది. అవధాన సుధాకర, సభా సంచాలక సార్వభౌమ వంటి ఎన్నో బిరుదులు, ప్రతిభా వైజయంతిక వంటి ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. యువతరం అర్ధం చేసుకునేలా ప్రాచీన కావ్యాలను, వ్యాఖ్యానాలను సమకూరుస్తున్న ఆచార్య బేతవోలుకు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సాహితీ: పురస్కారాన్ని ప్రకటించడం పట్ల పలువురు సాహితీ వేత్తలు, సాహితీ అభిమానులు హర్షం వ్యక్తంచేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. ఆయనకు శుభాభినందనలు.

ఈ సందర్భముగా ఆచార్య డా. బేతవోలురామబ్రహ్మం మహోదయులకు నా అభినందనలు తెలియఁజేసుకొంటున్నాను.

అమ్మవారు వీరిని నిరంతరం సంతోషంగా ఉండేలా అనుగ్రహించాలని మనసారా కోరుకొంటున్నాను.

జైహింద్.

12, సెప్టెంబర్ 2024, గురువారం

9వ పద్యము శ్రీమన్నారాయణ శతకము నుండి . గానం. శ్రీమతి దోర్భల బాలసుజాత. రచన. చింతా రామకృష్ణారావు.

0 comments

 జైశ్రీరామ్.


శ్రీమన్నారాయణ శతకము నుండి 

9వ పద్యము.

గానం. శ్రీమతి దోర్భల బాలసుజాత.

9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,

బిన్నన్, నేఁ గనఁ జాలనయ్య నిను గోపీనాథ! యంతర్ముఖుం

డెన్నంజాలు నినున్, శుభాస్పదుఁడ! నీవే నాకు కన్పించు. శ్రీ

మన్నారాయణ పూజ్య పాద జలజా! మాం పాహి. సర్వేశ్వరా!

భావము.

శ్రీమన్నారాయణా! నీవు నా హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభతో కొలువై యున్నావు.

నేను  చిన్నవాడిని. నిన్ను విధముగనూ నిన్ను చూచుటకు సరిపోను. అంతర్ముఖుఁడైనావాడి

నిన్ను గుర్తించగలడు. శుభాస్పదుఁడా! నీవే నాకు కన్పించుము. పూజ్య పాదపద్మములు

కలవాడా! సర్వేశ్వరా! నన్ను రక్షించుము

జైహింద్.

11, సెప్టెంబర్ 2024, బుధవారం

ఉత్తిష్ఠమానస్తు పరో - .. మేలిమబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ఉత్తిష్ఠమానస్తు పరో - నోపేక్ష్యః పథ్యమిచ్ఛతా |

సమౌ హి శిష్టైరామ్నాతౌ - వర్త్స్యంతావామయః స చ ||

(శిశుపాలవధ)

తే.గీ.  ఎదుగు చున్నట్టి దుష్టుని యెదుగుదలను

మంచితోనాపవలె, వేచి మించనీక,

పెరుగువ్యాధియు శత్రువు ధరను హాని

మనకు గొలుపుననెడు మాట మరువరాదు.

భావము.  హితాన్ని కోరేవాడు బలిష్ఠుడవుతున్న శత్రువును నిర్లక్ష్యం చేయకూడదు. 

పెరుగుతున్న వ్యాధి మరియు పెరుగుతున్న శత్రువు ఇద్దరూ హానికరంగా 

ఉండటంలో సమానమని ఉత్తములు భావిస్తారు.

జైహింద్.

అసాధారణ ప్రతిభాపాటవములతో సంస్కృతాంధ్రసాహితీ ప్రపంచంలో వెలిగిన డా. అయాచితం నటేశ్వరశర్మ నిన్న మధ్యాహ్నం కీర్తిశేషులయారని తెలియఁజేయుటకు బాధగా ఉంది. వారికి శ్రద్ధాంజలి.

0 comments

జైశ్రీరామ్.
డా. అయాచితం నటేశ్వర శర్మ.

ఇతడు 1956, జులై 17న కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, రామారెడ్డి గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించాడు. 1966వరకు రామారెడ్డిలోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో తిరుపతిలోని వేద సంస్కృత పాఠశాలలో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య, వ్యాకరణాలను చదివారు. 1977లో శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు కామారెడ్డిలోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. సంస్కృతాంధ్ర భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగాఉండేవారు.జాతీయసాహిత్యపరిషత్తు, హితసాహితి వంటి సాహిత్యసంస్థలలో కీలక పదవులలో సాహిత్య వికాసానికి కృషి చేశారు.ఎందరో యువకవులకు మార్గదర్శనం చేసి కవులుగా తీర్చిదిద్దారు.సంస్కృతంలో,తెలుగులో అష్టావధానాలు,శతావధానాలు చేశారు.

వీరి రచనలు 50కి పైగానే ఉన్నాయి.
వసంత కుమారి
శ్రీ గజానన స్తోత్రమ్‌
శ్రీ షోడశీ
భారతీప్రశస్తి
ఆముక్తమాల్యద పరిశీలనము
ఋతుగీత
శ్రీ శివమహిమ్నస్తోత్రవ్యాఖ్య
సమయ విలాసిని
నవ్యగీతి
బాలరామాయణము
కవితాశతకము
నవ్యనీతి శతకము
శ్రీ రాజేశ్వరశతకము
శ్రీ గణేశశతకము
శ్రీ మాతృకావర్ణమాలికా
శ్రీ రామగుణమణిమాల
ఆంధ్రతేజం
భారతీయ శతకము
ఆరురుచుల ఆమని
పంచశరీయమ్‌
వాణీశతకము
శ్రీకాలభైరవ సుప్రభాతమ్‌
శ్రీలలితాంబికాశతకమ్‌
లాస్యం
తాండవం
శ్రీ భీమేశ్వరశతకము
ప్రభాకరశతకమ్‌
లక్ష్మీధర వ్యాఖ్యానవైభవము
లక్ష్మీవిలాసము
భాగవతకథామృతం
సౌదామనీ విలాసము
రథాలరామారెడ్డిపేట
చైత్రరథం
జీవనయానము
పురుషార్థవివేచనం
నూటపదహారు
సిరినోము
చుక్కలు
శ్రీరామలింగేశ్వర హృదయము
ఆటవెలది
శతపత్రం
కాపర్తి వేంకటేశ్వర సుప్రభాతమ్‌
సంకష్టహర గణేశ నక్షత్రమాలిక
పంచతంత్ర కథామంజరి
శ్రీరేణుకా సుప్రభాత వ్యాఖ్య
శ్రీ గణపురాంజనేయ స్తుతి వ్యాఖ్య
శ్రీ వేంకటేశ్వర విలాసము
శ్రీమద్భాగవత దశమస్కంధానువాదం
రమణీయ శ్లోకం - కమనీయ భావం
శకుంతల

బిరుదులు
కవిరత్న
అవధానిశిరోమణి
మహోపాధ్యాయ

అందుకున్న పురస్కారాలు.
1977 - హైదరాబాద్ కళాసాహితి వారి రాష్ట్రస్థాయి ఉత్తమ కవితా పురస్కారం
1979 - వేములవాడ కళాభారతి వారి రాష్ట్రస్థాయి సాహిత్యవిమర్శ పురస్కారం
1980 - శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ రజతోత్సవాలలో భాగంగా ఉత్తమ కవితా పురస్కారం
1983 - భారతీప్రశస్తి కవితా సంపుటికి జాతీయ సాహిత్య పరిషత్తు పురస్కారం
1994 - సంస్కృతంలో ఉత్తమ సాహిత్య పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి నుండి స్వర్ణపతకం.
2002 - గరిశకుర్తి సాహితీ పురస్కారం
2005 - స్పందన సాహితి, రాయగడ (ఒరిస్సా) వారి ఉత్తమ కవితా పురస్కారం
2005 - నిజామాబాద్ జిల్లా ఉగాది ఉత్సవాలలో అవధాన పురస్కారం
2009 - రంజని - విశ్వనాథ జాతీయ పద్యకవితా పురస్కారం
2010 - శోభనాథ్‌సింహ్ కవితా పురస్కారం
2011 - కిన్నెర కుందుర్తి వచనకవితా పురస్కారం
2011 - రాష్ట్రకవి ఓగేటి సాహిత్య పురస్కారం
2012 - ప్రపంచ తెలుగు మహాసభలలో జిల్లా ఉత్తమకవి పురస్కారం
2012 - పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి అవధాన కీర్తి పురస్కారం
2014 - తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌, ఆలేరు వారి తేజ పురస్కారం
2016 - తెలుగు విశ్వవిద్యాలయము - ప్రతిభా పురస్కారాలు (2015) - తెలుగు విశ్వవిద్యాలయం, 20 డిసెంబరు 2O16.
2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ ఊపురస్కారం 2016 (శకుంతల పుస్తకానికి)
2023 - దాశరథి సాహితీ పురస్కారం (తెలంగాణ ప్రభుత్వం)

ఇట్టి మహనీయులు కాలధర్మం చెందుట సంస్కృతాంధ్ర సాహితీ జగత్తుకు తీరని లోటే. ఈ మహనీయునికి ఉత్తమ గతులు ప్రాప్తించుగాక.
జైహింద్.

తెలుగు సంస్కృత అవధాన వర్యులు డా|| అయాచితం నటేశ్వర శర్మ గారిచే దృశ్య శ్రవణము.

0 comments

జైశ్రీరామ్.


జైహింద్.

10, సెప్టెంబర్ 2024, మంగళవారం

పద్యకవితా సదస్సులో యర్రంసెట్టి ఉమామహేశ్వరరావు గీతావధానం. Part-1 Gitavadhanam | 16-4-23 Anakapalli | "MP" K.Satyavathigaru | @Umam...

0 comments

జైశ్రీరామ్.
జైహింద్.

విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్రప్రశస్తి సమీక్ష. ఆయన కవి సమ్రాట్టు..( Talk on Viswanadha )🌹 ఆచార్య వేణు. SREE BHARAT Chan...

0 comments

జైశ్రీరామ్.

జైహింద్.

9, సెప్టెంబర్ 2024, సోమవారం

అత్యల్పమపి సాధూనాం. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. అత్యల్పమపి సాధూనాం - శిలా లేఖతి తిష్టతి।

జల లేఖేన నీచానాం - యత్ కృతం తత్ వినశ్యతి॥

తే.గీ.  సాధు జనులకు చేసెడ దేదియైన

రాతిపై వ్రాతవలె నిల్చు ధాత్రిపయిన,

నీచులకు చేయునుపకృతి నీటిపైన

వ్రాతవలెమాయునప్పుడే, భవ్యులార!

(రాతి - ధాత్రి.సంయుతాసంయుత ప్రాస)

భావము. సజ్జనులకు చేసిన ఏ చిన్న ఉపకారమైనా అది రాతిమీద గీసిన గీతలా 

ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కొంచెము ఉపకారానికే వారు ఎల్లప్పుడూ 

కృతజ్ఙులై ఉంటారు. మరి నీచులున్నారే, వారికి ఎంత పెద్ద మేలు చేసినప్పటికీ 

నీటిమీద గీసిన గీతలా అది అప్పుడే నశించిపోతుంది.

జైహింద్.

7, సెప్టెంబర్ 2024, శనివారం

తిరుమల క్షేత్రం పద్యం 1 lyrics C.N. Nageswararao, singer Saraswathi val...

0 comments

హైశ్రీరామ్.
పద్యరచన ఎంత బాగుందో గానం కూడా అంత బాగుంది. రచయితకు గాయనీమణికీ ఆ పరమేశ్వరుఁడు నిరంతరం అండగా ఉండుగాక.
జైహింద్.

5, సెప్టెంబర్ 2024, గురువారం

13వ పద్యము. శ్రీమన్నారాయణ శతకము. రచన చింతా రామకృష్ణారావు. .. గానం. శ్రీమతి దోర్భల బాలసుజాత.

0 comments

జైశ్రీరాన్.

జైహింద్. 

3, సెప్టెంబర్ 2024, మంగళవారం

చిత్రబంధ కవి శ్రీ పుల్లూరి మాతయ్య రచించిన కందపద్య గర్భిత నిరోష్ఠ్య చంపకమాల నాగబంధము.

1 comments

 జైశ్రీరామ్.

 కందపద్య గర్భిత నిరోష్ఠ్య చంపకమాల  నాగబంధము.

నుతి సరసాలు,నీతియు ననూనరథస్థితి నారయన్, జన
స్తుతిఁగొనెడున్,సరైతిరి టుచోటు కదయ్యలు,లోకనాథయ
స్తుతి,సరసాల రీతి, నడఁజూడరయత్రసనల్,  రసాల్, దడ
ల్గతియె కదాతిశాంతిగతికాం(క్రాం)తిగ, జట్టులతోనె, తీయగాన్,
గర్భిత కందము;
సరసాలునీతియుననూ
న,రథస్థితి నారయన్,జనస్తుతిఁగొనెడున్, 
సరసాలరీతి నడఁజూ 
డ,రయత్రసనల్, రసాల్, దడల్గతియె,కదా!

-  0  0  0  -

ప్రపంచ బంధచిత్రకవన వాజ్మయంలో,
వర్తమానకాలంలో ఇదే పెద్ద బంధచిత్రం ఈబంధానికి నాకు మార్గదర్శనం 
చిదంబరక్షేత్రంలోని శిలాశాసనస్థ చిత్రబంధం.
శాసనసభా బంధం 
పేరు చతుస్సప్తతినాగబంధం(కొంత శిథిలం)
ఈ బంధాన్ని నేను చిత్రించి నా బంధచిత్రశిష్యుని ఇలాంటి బంధ చిత్రాన్ని రచించమని ఆదేశించినాను
అతడు ఈ కింది బంధచిత్రాన్ని కందాలలో రచించి, బంధంలోనా పేరు
ఉండేలానాకుఅంకితంగరచించినాడు.
అన్నారు శ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు.

ఆ ద్విసప్తతి నాగబంధచిత్రం
👇

చిత్రబంధ కవి శ్రీ పుల్లూరి మాతయ్య కృతము

జైహింద్.

1, సెప్టెంబర్ 2024, ఆదివారం

ధన్యానాముత్తమమ్ దాక్ష్యం. .. మేలిమిబంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

శ్లో.  ధన్యానాముత్తమమ్ దాక్ష్యం - ధనానాముత్తమమ్ శ్రుతమ్ ।

లాభనాం శ్రేయ ఆరోగ్యం - సుఖానాం తుష్ఠిరుత్తమా ॥

(యుధిష్ఠిర గీత 53వ శ్లోకం)

తే.గీ.  భౌతికముకంటె మర్యాద వసుధ నిన్న,

జ్ఞానమెన్నగ సంపదకన్న ఘనము,

ధనము కన్నను స్వస్తత ధరణి మేలు,

సుఖములందున తుష్టియే చూడ ఘనము. 

భావము. మర్యాద గల ప్రవర్తన భౌతిక విషయాల కంటే శ్రేష్ఠమైనది, 

జ్ఞానం సంపద కంటే గొప్పది. ధనలాభము కంటే ఆరోగ్యం శ్రేష్ఠమైనది 

మరియు సంతృప్తి అనేది అన్నింటిలోనూ ఉత్తమమైనది.

జైహింద్.


సుకృతేన కులే జన్మ. .. మేలిమి బంగారం మన సంస్కృతి.

0 comments

 జైశ్రీరామ్.

ఓం శ్రీమాత్రే నమః.🙏🏼


శ్లో.  సుకృతేన కులే జన్మ - సుకృతేన సుభాషితమ్l

సుకృతేన సతీ భార్యా - సుకృతేన కృతీ సుత:ll

తే.గీ.  మంచి కులమున పుట్టుట మహిత సుకృతి,

మంచి సుకృతిని లభియించు మంచి వాక్కు,

మంచి సుకృతిచేత లభించు మంచి భార్య,

మంచి సుకృతినే పుత్రుఁడున్ మహిని కలుగు.

కులము = 1. వంశము; 2. తెగ; 3. ఇల్లు; 4. ఊరు; 5. శరీరము.(శబ్దరత్నాకరము)

భావం: సత్కులములో జన్మించడమూ, మంచి మాటకారితనమూ, 

సాధ్వియైన భార్యా, వివేకవంతుడైన పుత్రుడూ.. పుణ్యం వలన మాత్రమే 

లభ్యమగును సుమా!

జైహింద్.

దేహే పాతిని కా రక్షా. .. మేలిమిబంగారం మన సంస్కృతి

0 comments

 జైశ్రీరామ్.

శ్లో. దేహే పాతిని కా రక్షా - యశో రక్ష్యమపాతవత్|

తస్మాద్దేహేష్వనిత్యేషు - కీర్తి మేకా ముపార్జయేత్||

తే.గీ.  పతన దేహంబునకు రక్ష క్షితిని లేదు,

కీర్తి దేహంబునకు లేదు క్షీణత ధర,

కాన దేహంబుతో కీర్తి గాంచుటొప్పు,

శాశ్వతంబగు సత్కీర్తి చక్కఁ గనుము.

భావము. నశించునట్టి ఈ మానవదేహమునకు రక్షణ ఎక్కడ కలదు?అందువలన 

అనిత్యమైన ఈ దేహముతో నిత్యమై సత్యమై వెలుగొందు శాశ్వతమైన కీర్తిని 

మానవుడు ఆర్జించవలెను.

జైహింద్.