గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జనవరి 2022, ఆదివారం

శ్లో. వేదావినాశినం నిత్యం.. || 2 . 21|| ..//..వాసాంసి జీర్ణాని యథా విహాయ.. || 2 . 22|| ..//..సాంఖ్యయోగము

 జైశ్రీరామ్.

శ్లో.  వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ || 2 .  21|| 

తే.గీ.  చావుపుట్టుకల్ లేనిదై శాశ్వతమయి

యుండునాత్మయం చెఱిగిన నోపునెవఁడు 

చంపగను దాని దానిచేఁ జంపఁజేయ?

పార్థుఁడా! నీ వెఱుఁగవొకొ? పద్ధతినిట. 

భావము.

పార్థా ! ఆత్మ నాశనరహితమనీ, చావు పుట్టుకలు లేనిదనీ, శాశ్వత

మైనదనీ  తెలుసుకున్నవాడు  ఎవరినైనా ఎలా చంపుతాడు?

ఎలా చంపిస్తాడు?

శ్లో.  వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో௨పరాణి |

తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ  || 2 .  22|| 

తే.గీ.  ప్రాత చిరిగిన వస్త్రము విడిచిపెట్టి

నూతనంబైన వస్త్రమును తొడుగునటు,

శిధిలదేహంబు వీడుచు జీవుం_డటులె

క్రొత్త దేహంబులో చేరి కుదురుకొనును

భావము.

మానవుడు చినిగిపోయిన పాతబట్టలను విడిచిపెట్టి క్రొత్తబట్టలు 

వేసుకున్నట్లే ఆత్మ కృశించిన  శరీరాలను వదలి కొత్త దేహాలు 

పొందుతుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.