గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఫిబ్రవరి 2019, శనివారం

ద్విపాది

జైశ్రీరామ్
ద్విపాది 

రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠా తిశయము రాణిలుట కంటె
రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠా తిశయము రాణిలుట కంటె

ఇందులో ఒకటి, రెండు పాదాలు ఒకేలాగా ,మూడు,నాలుగు పాదాలు ఒకే లాగా వున్నాయి.
కానీ అర్థం మాత్రం వేరు.ప్రకాశించే పర్వత శిఖరాగ్రాన వేడుకగా తిరిగే ఈశ్వరుని గొప్పతనం
కంటె అని ఒకటి,రెండు పాదాల అర్థం. విరాజిల్లుచున్న చెట్టు చివర సంచరించే నెమళ్ళఅతిశయం చూశావా? అని మూడు,నాలుగు పాదాల అర్థం.ఈశ్వరుని కంటె కూడా నెమళ్ళు ఒప్పారుచున్నవి అని వర్ణించిన భావం ఎంతో రమణీయంగా వుంది కదా! ఇది కాశీపత్యవధానుల గారి వర్ణన.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గౌరవ నీయులైన కాశీ పత్యవధానులు గారి ప్రతిభకు జోహారులు. మా కందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.