గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, ఫిబ్రవరి 2019, ఆదివారం

అన్నీ గుడులు వుండే చిత్ర కవిత శ్రీకాశీ పత్యవధానులు.

జైశ్రీరామ్.
అన్నీ గుడులు వుండే పద్యం శ్రీకాశీ పత్యావధానులు.

కినిసి సిరి దీసి నీలిగి
తిని సిగ్గిడి కింగిరి కిని దిగి తీరితికి గి
త్తిని జీరినించి చిక్కిడి
తిని జియ్యా యింతి కీరితిని నిల్చిరిసీ

హరిశ్చంద్రుని పై కోపంతో అతని ఐశ్వర్య మంతా పోయేటట్లు చేశాను. సిగ్గులేక నీచ కార్యానికి (కింగిరిసి) దిగాను.అగ్ని (కిత్తి) వంటి హరిశ్చంద్రుని పిల్చి,నిందించి, ఎన్నో
కష్టాలకు గురి చేశాను. అయినా ఈ రాజు,రాణి (జియ్యా యింతి) కీర్తిని గెల్చుకున్నారు.
అని పైన పేర్కొన్న పద్య భావం. విశ్వామిత్రుడు తనను తాను నిందించుకునే సందర్భాన్ని పురస్కరించుకొని. అన్నీ గుడులతోనే పద్యం వ్రాయడం ఎంతో
ఔచిత్యవంతంగావుంది.
జైహింద్..
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగుంది అవధాని గారి ప్రతిభ అద్భుతముగా నున్నది.పాదాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.