గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జూన్ 2015, శనివారం

కాళిదాసు దండి ల చమత్కార శ్లోకమ్.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కాళిదాసు దండిల చమత్కార పద్యం చూడండి.
కాళిదాసు, దండి తాంబూలం కోసం ఒక దుకాణానికి వెళ్లారట. 
దండి ముందుగా సున్నం కావాలని ఆ దుకాణంలోని అమ్మాయిని ఇలా అడిగాడట.
"తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే"
(ఓ పూర్ణ చంద్రుడిలాంటి ముఖం గల చిన్నదానా! త్వరగా సున్నం ఇప్పించు).
వెంటనే కాళిదాసు
"పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంత కీర్ణ లోచనే"
(చెవుల వరకు వ్యాపించిన విశాలు నేత్రాలు గల దానా! బంగారు వన్నెగల తమలపాకులు కూడా ఇప్పించు).
అని అన్నాడట.
ఆమె ముందుగా కాళిదాసుకు తమలపాకులిచ్చి, తర్వాత దండికి సున్నం ఇచ్చిందట.
"ముందుగా నేనడిగితే ఆయనకు ఇచ్చావేంటి"
అని అడిగాడట దండి.
దానికి ఆమె
"మీరిద్దరూ మహాకవులు, చమత్కారులు. మీలో ఎవరు గొప్పో చెప్పే స్థాయి నాకు లేదు.
ముందు మీరు 3 "ణ" లు వచ్చేలా ఒక వాక్యం చెప్పారు.
తర్వాత ఆయన 5 "ణ" లు వచ్చేలా మరో వాక్యం చెప్పారు.
మూడణాల కంటే ఐదణాలు పెద్ద బేరం కదా అని అగ్ర తాంబూలం ఆయనకిచ్చాను"
అని చమత్కరించింది ఆ దుకాణం నడిపే ఆ అమ్మాయి.
అణాని డబ్బులరూపంలో చెప్పాలంటే అణా కి పన్నెండు దమ్మిడీలు.
ఇప్పటి పైసలైతే అణాకి ఆరు పైసలు.
ఆమె లెక్ఖ ప్రకారం దండి ఇచ్చినది మూడణాలైతే, కాళిదాసు ఇచ్చినది మాత్రం ఐదణాలు. అంటే దండి కంటే కాళిదాసే ఎక్కువ ఇచ్చాడు కాబట్టి కాళిదాసుకే ముందుగా తమలపాకులనిచ్చింది ఆ సుందరి.
చూచారా! ఆ నాడు సంభాణలో కూడా ఎంతటి చమత్కారం ఉండేదో!.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తమలపాకుల చమత్కారం బాగుంది. ఇలాటిదే కదా " నెల్లూరి నెరజాణ " చంత్కారం కుడాను .బాగుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.