గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మే 2014, శనివారం

యావత్ తెలంగాణ, సీమాంధ్ర ప్రజానీకానికి, ప్రజా ప్రతినిథులకు నా అభినందనలు.

జైశ్రీరామ్.
యావత్ తెలంగాణ, సీమాంధ్ర ప్రజలారా! మీకు నా అభినందనలు.
మీరు ఓటు ద్వారా మీ మీ తరపున ప్రభుత్వము నడిపించ వలసిన ప్రజా ప్రతినిథుల నెన్నుకొనుటలో మీరంతా కృతకృత్యులయ్యారు. అందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు.
మనం ఎన్నుకొన్న ప్రతినిథులు స్వార్థ రహితంగా ఉంటూ, తమ బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తించాలని, మన జీవితాలు సుఖమయం కావాలని మనసారా కోరుకొంటున్నాను.
తెలంగాణా ప్రాంతంలో ఎన్నికయిన టీఆరెస్ ప్రజాప్రతినిథులైనా, సీమాంధ్రలో ఎన్నికైన తే.దే.పా. ప్రతినిథులైనా  క్రమశిక్షణతో , నిబద్ధతతో, నిస్వార్థంతో, నిరుపమానమైన దీక్షా బద్ధులై ప్రజాసేవకు పరిపూర్ణంగా అంకితమౌతూ, మన తెలుగు గడ్డపై అవినీతికి నిలువనీడ లేకుండా చేస్తూ, మనకు కనీస జీవనానందాన్నందించాలని మనసారా కోరుకొంటున్నాను.
తెలంగాణాలో ఎంపికైన టీఆరెస్స్ రథ సారథి శ్రీ కేసీఆర్ గారికి, వారి సహచరులైన ప్రజా ప్రతినిథులకు,సీమాంధ్రలో పరిపాలనా పగ్గాలు చేబట్టబోతున్న తె.దే.పా. ప్రతినిథియైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి సహచరులైన ప్రజా ప్రతినిథులకు నా హృదయ పూర్వకమైన అభినందనలు తెలియజేసుకొంటున్నాను.
అయ్యలారా! దయచేసి మీరు మిమ్ములనెన్నుకొనిన ప్రజల ఓటు విలువను తగ్గించకండి. మీపై కొండంత ఆశపెంచుకొని మీకు ఓటు వేసిన పెఅజానీకంయొక్క ఆశలు తీర్చడానికి మనసారా ప్రయత్నించండి.
మీరంతా పరిపూర్ణమైన అత్యద్భుతమైన సంసేవనా దృక్పథంతో, ప్రజల జయజయ ధ్వానాలను మీరెక్కడికి వెళ్ళినా అందుకోవాలని, ఎన్ని పర్యాయములైనా తమిళనాడులో శ్రీమతి జయలలిత వలె మీరు కూడా ఎప్పుడూ ప్రజలు మిమ్ములనే ఎన్నుకొనే విధంగా వారి మనౌలను మీరు దోచుకోవాలని కోరుకొంటున్నాను. శుభమస్తు
మీ సహచరుడైన తెలుగు బిడ్డ
చింతా రామ కృష్ణా రావు.
జై భారత్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.