గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మే 2014, బుధవారం

జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః మేలిమి బంగారం మన సంస్కృతి190.

జైశ్రీరామ్.
శ్లో. జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః
 హేతుః సర్వ విద్యానాం ధర్మస్య  ధనస్య 
.
క. ఒక్కొక్క నీటి బిందువు
చక్కగ పడినంత కుండ చక్కగ నిండున్.
ఒక్కొక్క విషయమెఱిగిన
నిక్కమువిద్యాధనాళినిండునుమదిలో.
భావము. ఒక్కొక్క నీటిబొట్టు పడటం వల్ల క్రమంగా కుండ నిండుతుంది.అలాగే అన్ని విద్యలు ,  ధర్మము ,   ధనము కొద్దికొద్దిగా ఆర్జన చేస్తేసంపూర్ణమౌతాయి.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.