గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, మే 2014, ఆదివారం

ధేనుర్నో జననీ ప్రియా. మేలిమి బంగారం మన సంస్కృతి188.

జైశ్రీరామ్.
శ్ల్లో. తృణాం ఖాదతి కేదారే , జలం పిబతి పల్వలే 
దుగ్ధం యచ్ఛతి లోకేభ్యో ధేనుర్నో జననీ ప్రియా.

క. పొలమున మేతను మేయుచు
చలములజలములను త్రావి, చక్కగ  క్షీరం
బిలజనులకిచ్చు ధేనువు
తలచగమన తల్లి నిజము దయఁ గాచుడయా!
భావము. పొలాలలో గడ్డి తింటూ ,గుంటలలో నీళ్ళు త్రాగుతూ లోకులకు పాలనిచ్చే ఆవు - మనకు కన్న తల్లి వంటిదే కదా.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గడ్డి తిన్న ఆవు కమ్మని పాలిస్తుంది ఆ పాలుత్రాగిన మనిషి విషం కక్కుతాడు .అందుకే మంచివారిని గంగిగోవు అంటారు .పసితనాన్ని పెంచేది గోమాత . తల్లికంటె ఎక్కువె

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.