గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఏప్రిల్ 2013, మంగళవారం

కీ.శే.నండూరి రామ కృష్ణమాచార్యుల వారి93వ జయంతిమహోత్సవము.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
నండూరిరామ కృష్ణమాచార్య సాహిత్య పీఠము వారు నిన్న కీ.శే.నండూరి రామకృష్ణమాచార్యులవారి 93వ జయంతి మహోత్సవమును రవీంద్ర  భారతిలో అత్యద్భుతంగాజరిగింది. ఆచార్య ఫణిధర్, సహోదర సమేత శ్రీ నండూరి శొభనాద్రి , శ్రీ చిక్కా రామదాసు, వారి బృందము చక్కని ప్రణాళికా బద్ధంగా ఈ కార్యక్రమమును నిర్వహింప జేసారు.
ఈ కార్యక్రమమునకు ముందుగా శ్రీ చిక్కా రామదాసుగారి నిర్వహణలో శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి గారిచే సుశిక్షితులైన బాల బాలికలచే శ్రీ నండూరివారి పద్య పఠన కార్యక్రమం ఆహుతుల మనసులనాకట్టుకొంది.
తదుపరి శ్రీ ఫణీంద్ర సారధ్యంలో కార్యక్రమం నిర్వహింపబడింది.
డా.రాళ్ళబండి కవితా ప్రసాద్ సభాధ్యక్షులు కాగా, శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు ముఖ్య అతిథిగా సభనలంకరించారు. శ్రీ నండూరి రామ కృష్ణమాచార్య సాహితీ పీఠ పురస్కారమునకె ఎంపిక కాబడిన శ్రీ మేడసాని మోహన్ గారు వేదికనలంకరించారు.డా.తిరునగరి, డా.ఏకాంబరాచార్యులు వేదికనలంకరించారు.
వేదికనలంకరించిన పెద్దలందరూకూడా కీ.శే. నందూరి కవితో వారికిగల ప్రత్యక్ష పరోక్ష పరిచయములను, అనుభూతులను వెల్లడించి అనేకమైన కవిని గూర్చిన అంశములను వెల్లడించారు.
శ్రీ మేడసాని మోహన్ ను ఈ సభ సముచిత సత్కారంతో అలరింప జేసింది.
ఈ సాహితీ పీఠ అధ్యక్షులు శ్రీ కళ్ళెపు సాగర రావు, కోశాధికారి శ్రీ ఆత్మకూరి గాంధీ, కార్యదర్శి శ్రీ ఫణీంద్ర సాహితీ పీఠము చేపట్టిన కార్యక్రమములనుగ్గడించారు.
ఆహుతులను అల్పాహారాదులతో గౌరవించారు.
ఈ కార్యక్రమమునకు విశాఖపట్టణమునుండి విశాఖ జిల్లా పద్య కవితా సదస్సు అధ్యక్షులు శ్రీ కే. కోటారావు, హాజరు కాగా, రాజమహేంద్ర వరమునుండి కూడా అభ్గిమానులనేకమంది వచ్చుట ఇక్కడ చాలా విశేషముగా అందరి మనస్సులను ఆకట్టుకొన్నది.
శ్రీ మేడసాని మోహన్ గారి అసాధారణ ధారణాపటిమను ఈ సభలో చవి చూపించి ప్రేక్షకులను ముగ్ధులను చేశారు.
దీనికి సంబంధించిన ఛాయా చిత్రములను లభించగనే ఉంచ గలనని తెలియ జేయుచున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖుల కార్య క్రమా లలో పాలు పంచుకున్న అదృష్ట వంతులు. ఇక్కడ ఆటా సభలకి వచ్చినప్పుడు శ్రీ రాళ్ళ బండి కవితా ప్రసాద్ గారిని దర్శించ గల అదృష్టం కలిగింది. మంచి విషయాన్ని అందించి నందుకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.